మహబూబ్నగర్ : మరో 20 ఏండ్లు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మహబూబ్ నగర్ పట్టణాన్ని మోడల్ ప్లాన్డ్ సిటీగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందులో భాగంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నామన్నారు. ఆర్వీ అసోసియేట్స్ ఆర్కిటెక్ట్స్ ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మహబూబ్ నగర్ పట్టణం హైదరాబాద్ నగరానికి సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నది.
ఈ నేపథ్యంలో పట్టణాన్ని సుందరంగా, ప్లాన్డ్ సిటీగా తీర్చిదిద్దేందుకు వచ్చే 20 ఏండ్లకు అవసరమైన మాస్టర్ ప్లాన్ ను రూపొందించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశంలోనే మోడల్ ప్లాన్డ్ సిటీగా మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు.
మహబూబ్ నగర్ పట్టణాన్ని జాతీయ రహదారులకు అనుసంధానిస్తూ రోడ్లు, కమర్షియల్ సెంటర్లు, రెసిడెన్షియల్ జోన్లు, ఇండస్ట్రియల్ జోన్లు, బైపాస్ రోడ్డు, నూతనంగా నిర్మించనున్న బైపాస్ రోడ్డు ఏర్పాటుతో పాటు, మహబూబ్ నగర్ ను అద్భుతమైన ప్లాన్డ్ సిటీ గా తీర్చిదిద్దేందుకు తగిన ప్రతిపాదనలను రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు.
సమావేశంలో ఆర్వీ అసోసియేట్ అధికారులు, టీమ్ లీడర్ పళని, అర్బన్ ప్లానర్ శేఖర్ గౌడ్, అర్బన్ ప్లానర్ కె. ప్రత్యూష పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం
ఎన్నారైలు ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే..
పీఎంవో వల్ల కాదు కానీ.. ఆ పని గడ్కరీకి అప్పగించండి: ప్రధానికి స్వామి సూచన