శ్రీశైలం : శ్రీశైల దేవస్థానం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి రాలేని భక్తుల కోసం మెదలుపెట్టిన పరోక్షసేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.
కొవిడ్ కారణంగా క్షేత్రానికి వచ్చి నిత్య ఆర్జిత సేవల్లో నేరుగా పాల్గొనే అవకాశం లేనందున భక్తులు ఆన్లైన్ ద్వారా నిర్ణీత సేవల్లో తమ గోత్రనామాలు నమోదు చేసుకునేందుకు www.srisailadevasthanam.org వెబ్సైట్ ద్వారా వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
అదే విధంగా వెబ్సైట్ నుంచి నేరుగా స్వామి అమ్మవార్లకు మెక్కులు, కానుకలు సమర్పించేందుకు వీలుగా ఈ హుండీని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు.
ఆన్లైన్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి విభూది, కైలాస కంకణాలు, పసుపు, కుంకుమలను పోస్టల్ ద్వారా పంపిస్తామని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా భక్తులు స్వామి అమ్మవార్ల కైంకర్యాలను ఇంటర్ నెట్లో శ్రీశైల టీవీ ప్రసారాలను వీక్షించవచ్చని
ఈఓ తెలిపారు. మరింత సమాచారానికి కాల్ సెంటర్ 8999901951,52,53,54,55,56 నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.