వనపర్తి : రామన్నగట్టు వద్ద రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుండి కాశీంనగర్కు సాగు నీళ్లు తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి మండలం కాశీం నగర్, కంద్రియా తండా, నాగమ్మ తండాలకు చెందిన నూతన ఆసరా పింఛన్ కార్డులు, బతుకమ్మ చీరలను పంపిణీ చేసి మాట్లీఆడారు.
వనపర్తి నియోజకవర్గంలోని 211 గ్రామాలు 135 గ్రామపంచాయతీలలో ఒక్క కాశీంనగర్కు మాత్రమే సాగు నీరు రాలేదన్నారు. మోటర్లు ఏర్పాటు చేసి గతంలో కొన్ని నీళ్లు తీసుకువచ్చాను. కానీ, అవి సరిపోవు.
2005 వరకుకు పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టాలు అందిస్తాం. మూడు తరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులకు పట్టాలు అందిస్తామని మంత్రి తెలిపారు.
పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాల అమలు చేస్తున్నామన్నారు.