మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా.. మొహాలీలో ముగిసిన తొలి వన్డేలో నెగ్గినా నాగ్పూర్, హైదరాబాద్లలో మాత్రం పరాజయం పాలై సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్లో భారత పేస్ బౌలర్లు దారుణంగా విఫలమైనా ఆసీస్ను కట్టడి చేసింది మాత్రం స్పిన్నర్ అక్షర్ పటేల్ ఒక్కడే. మూడు మ్యాచ్లలోనూ అక్షర్ తనదైన మార్కు చూపించాడు. తాజాగా అక్షర్ ప్రదర్శనపై ఆస్ట్రేలియా హెడ్కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ ప్రశంసలు కురిపించాడు.
నిన్నటి మ్యాచ్ అనంతరం మెక్డొనాల్డ్ మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్లో అక్షర్ అద్భుతంగా రాణించాడు. గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి రవీంద్ర జడేజా తప్పుకోవడంతో టీమిండియా బలహీనపడిపోయిందని అనుకున్నాం. కానీ అక్షర్ మాత్రం జడేజా స్థానాన్ని భర్తీ చేశాడు. అతడి బౌలింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.. ఒక ఆటగాడు లేడు అనుకుంటే అతడిని భర్తీ చేసే ఆటగాళ్లను టీమిండియా తయారుచేసుకుంది…’ అని చెప్పాడు.
ఈ సిరీస్లో జడేజా.. 3 మ్యాచ్లు ఆడి 8 వికెట్లు పడగొట్టాడు. మొహాలీలో 4 ఓవర్లు వేసి 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా.. వర్షం వల్ల 8 ఓవర్లకు కుదించిన నాగ్పూర్ మ్యాచ్లో 2 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హైదరాబాద్లో కూడా తన ఫామ్ను కొనసాగిస్తూ.. 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.
మొత్తంగా ఈ సిరీస్ లో 8 వికెట్లు తీసినందుకు గాను అక్షర్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. ఆసియా కప్లో ఒక్కటే మ్యాచ్ ఆడి ఆ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న జడేజా స్థానంలో అక్షర్ను ఆస్ట్రేలియా సిరీస్తో పాటు టీ20 ప్రపంచకప్కూ ఎంపిక చేయడంతో అతడు తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.