పాలకుర్తి : కార్యకర్తలే పార్టీకి ప్రాణమని, ఆ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత బాధిత కార్యకర్తలకిచ్చే ప్రమాద బీమా చెక్కులను ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున మంత్రి అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీల మనుగడ పార్టీ కార్యకర్తల మీద ఆధారపడి ఉంటుందన్నారు. ఈ విషయం తెలిసిన సీఎం కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు మిగతా ఏ పార్టీలకు లేని విధంగా బీమా సదుపాయం కల్పించారన్నారు. వారి ప్రీమియంని కూడా పార్టీనే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారన్నారు.
పాలకుర్తికి చెందిన గుంజే రాజు భార్య గుంజే సుజాతకు, దేవరుప్పుల మండలంలోని చిన్న మడురు గ్రామానికి చెందిన మొగుళ్ల సోమనర్సయ్య భార్య విజయమ్మకు రూ.2 లక్షల చొప్పున చెక్కులను మంత్రి అందచేశారు. చెక్కులు పొందిన బాధితులు మంత్రి కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో పాలకుర్తి దేవరుప్పుల మండల టీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.