ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం మన మనసులో నుంచే వస్తాయని అంటున్నది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. నిరుత్సాహానికి గురయ్యే సందర్భాలు తనకూ వస్తుంటాయని, వాటి నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తానని చెబుతున్నదీ అందాల తార. ఇటీవల ఓ కార్యక్రమంలో రష్మిక మందన్న మాట్లాడు తూ…‘మన ప్రతిభా సామర్థ్యాలపై కొన్నిసార్లు మనకే సందేహాలు కలుగుతుంటాయి.
నిరుత్సాహానికి లోనవుతుంటాం. ఆత్మవిశ్వాసం ఉంటే వీటన్నింటి నుంచి బయటపడొచ్చు. సానుకూలంగా ఆలోచించడం ఎప్పుడూ మంచే చేస్తుంది’ అని చెప్పింది. ‘పుష్ప’ తొలి భాగం ఘన విజయం తర్వాత రష్మిక మందన్న క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’, అమితాబ్ బచ్చన్తో ‘గుడ్ బై’, సిద్ధార్థ్ మల్హోత్రా జోడీగా ‘మిషన్ మజ్ను’, తమిళ హీరో విజయ్తో కలిసి ‘వారసుడు’, రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ‘యానిమల్’ చిత్రాల్లో నాయికగా నటిస్తున్నది.