చౌటుప్పల్, అక్టోబర్ 15: ‘మేం మోసపో యాం.. మీరూ మోసపోకండి.. ఇట్లు దుబ్బా క, హుజూరాబాద్ ప్రజలు’ అని రాసిన పోస్ట ర్లు మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లో కనిపించాయి. బీజేపీకి వ్యతిరేకంగా శుక్రవారం రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి. మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడం కొత్తేమీ కాదు. మొదటగా ‘మునుగోడు నిన్ను క్షమించదు’ అని పోస్టర్లు కనిపించాయి.
ఆ తర్వాత ఫోన్ పే ట్రాన్సాక్షన్ పే అంటూ రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు రాజగోపాల్రెడ్డికి కేటాయించిన విషయాన్ని గుర్తుచేస్తూ పోస్టర్లు వెలిశాయి. మరో చోట ‘నేడే రూ.18 వేల కోట్లు విడుదల.. దర్శకత్వం.. కోవర్ట్ రెడ్డి’ అం టూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ పోస్టర్లపై చర్చ జరుగుతున్నది. నిజాలు తెలియజేస్తూ ఆలోచింపజేసేలా ఉన్నాయంటూ పలువురు చెప్పుకొంటుండటం గమనార్హం.