మహబూబ్నగర్ : గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గిరిజన ఉద్యోగుల సంఘం భవనానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.
70 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి కాబడి, అడవి బిడ్డలుగా గుర్తించబడిన గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జిల్లాలో గిరిజనుల కోసం13 కోట్ల రూపాయల వ్యయంతో సేవాలాల్ మహారాజ్ భవనంతో పాటు, గిరిజన మహిళా ఉద్యోగినుల వసతి గృహం, గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల, ఉద్యోగుల సంఘ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు.
అందరితో సమానంగా గిరిజనులు ఎదగాలని రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని పేర్కొన్నారు. 70 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చి దిద్దిందిముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. తండా లకు కూడా కోట్ల రూపాయలను వెచ్చించి బిటి రహదారులను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్, డిసిసిబి ఉపాధ్యక్షుడు వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, గిరిజన సేవా సంఘం అధ్యక్షుడు రాజు నాయక్, ఉద్యోగుల సంఘం కార్యదర్శి చందర్ నాయక్, పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్, ఉద్యోగుల సంఘం కార్యదర్శి యాదగిరి, లక్ష్మణ్ నాయక్, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడురామ్ బల్ నాయక్, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం గోవింద్ నాయక్, లక్ష్మణ్ నాయక్, బాలనగర్ జడ్పిటిసి కళ్యాణి, మోతిలాల్, కౌన్సిలర్లు లక్ష్మణ్, విఠల్ నాయక్ , రవి, చిల్డ్రన్స్ హాస్పిటల్ అధినేత శేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ జే.ఇశ్రా నాయక్ తదితరులు పాల్గొన్నారు.