అమరావతి : ఏపీలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఇదివరకే రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, రద్దు ఆలోచన లేదని , అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
రైల్వే జోన్ ఏర్పాటుకు డీఆర్ఎం కార్యాలయం పక్కనే స్థలం ఎంపిక చేశారని, భూసేకరణ కూడా పూర్తయింద ని పేర్కొన్నారు. అయితే విశాఖ జోన్ ఏర్పాటులో పునరాలోచిస్తే ఆ విషయం చెబుతామని ప్రకటించారు. కాగా రైల్వే జోన్ రద్దయినట్లు వస్తున్న ప్రచారాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. కేంద్రం రద్దు నిర్ణయం తీసుకుంటే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు.