వనపర్తి, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాగా ఏర్పడడంతో ఉపాధి అవకాశాలు పెరిగాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 38వ వార్డులో రూ.2.10 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డు, నాగవరం తండా సమీపంలో రూ.25 లక్షలతో 29 గుంటల భూ మిలో నిర్మించనున్న రిజిస్ట్రార్ కార్యాలయానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఐజయ్య కాలనీ చిన్నారులు, మహిళలు మంత్రికి బొట్టుపెట్టి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ దశల వారీగా ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వివిధ రకాల బైక్, కార్ల షోరూంలు, మార్కెట్లు, మాల్స్ ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ఏడాదిన్నరలోపు వ నపర్తి సమీపంలో ఆహారశుద్ధి పరిశ్రమలు, 150 నుంచి 200 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయన్నారు. యాదాద్రిలో కేసీఆర్ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారని స్థానికంగా ఆలయ నిర్మాణానికి నావంతు సహకారం అందిస్తానన్నారు. నూతన పా ర్కుతో స్థలాలు కోల్పోతున్న బాధితులకు డబుల్ బె డ్రూం ఇండ్లు కేటాయిస్తామన్నారు. 12 తర్వాత జిల్లా కేంద్రంలోని ప్రతి వార్డులో పర్యటించనున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్, గ్రం థాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, కౌన్సిలర్ రవి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వనపర్తి/పాన్గల్, డిసెంబర్ 6 : దేశానికి గొప్ప రా జ్యాంగాన్ని అందించడంలో అంబేద్కర్ కృషి ఎనలేనిదని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం జి ల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ అంబేద్కర్ వర్ధంతి లో టీఆర్ఎస్ నాయకులతో కలిసి మంత్రి పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, గ్రంథాలయ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, కౌన్సిలర్లు నారాయణ, పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి పరంజ్యోతి, నాయకులు శివ, వెంకటేశ్, రమేశ్నాయక్, మాధవరావు సునీల్, నాయకులు పాల్గొన్నారు.
పాన్గల్ బాలుర ఉన్నత పాఠశాలలో ‘లెట్మీ ైప్లె’, రచయిత సుధాకర్గౌడ్ రచించిన ‘మంచి ముత్యాలు’ పుస్తకాలను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంతి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించడంతోపాటు చెడును విసర్జించి, మంచిని స్వీకరించాలన్నారు. రచన, చదివే అలవాటు మూలంగా ప్రతి ఒ క్కరిలో విషయ సంగ్రహనతోపాటు జ్ఞానం పెరుగుతుందని చెప్పారు. అనంతరం సీతారామాంజనేయ స్వామి పునఃప్రతిష్ఠాపన స్థలాన్ని పరిశీలించి ఆలయ నిర్మాణానికి రూ.50 లక్షలు నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు. సమావేశంలో ఎంపీపీ శ్రీధర్రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మి, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మునీరొద్దీన్, సర్పంచ్ గోపాల్రెడ్డి, ఎంపీటీసీ హైమావతి, తాసిల్దార్ యేసయ్య, ఎంపీడీవో నాగేశ్వర్రెడ్డి, ఎంఈవో లక్ష్మణ్నాయక్, రచయితలు కిరణ్, వెంకటేశ్వర్రెడ్డి, బాల్ రాం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాముయాదవ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వెంకటయ్య నా యుడు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.