మహబూబ్నగర్ : టీఆర్ఎస్ సభ్యత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఆధరణ లభిస్తున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. తాజాగా జిల్లాలోని హన్వాడ మండలం తువగడ్డ తండాలో 200 మంది ఓటర్లు ఉండగా 150 మంది గిరిజనులు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న వివిధ కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని గిరిజనులు ఈ సందర్భంగా తెలిపారు. టీఆర్ఎస్ పాలనలోనే తమ బతుకులు బాగుపడ్డాయని చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని తండా వాసులు సంతోషంగా చెప్పారు.