కృష్ణా ఫేజ్-1, 1200 ఎంఎం డయా మెయిన్లైన్ జంక్షన్కు సంబంధించిన పైపులైన్ విస్తరణ పనులను చేపడుతున్న కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి ఎండీ దానకిశోర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చాంద్రాయణగుట్ట నుంచి కందిగల్గేట్ క్రాస్రోడ్డు వరకు పైపులైన్ విస్తరణ పనులు చేపడుతున్న కారణంగా ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 2 ఉదయం 6గంటల వరకు సుమారు 24 గంటల పాటు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. మీరాలం రిజర్వాయర్, కిషన్బాగ్, అల్దుబైల్ కాలనీ, అలియాబాద్ రిజర్వాయర్ ప్రాంతం, బాలాపూర్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.