సూర్యాపేట రూరల్, ఆగస్టు 13 : ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తే, టీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ సాగు నీటి ప్రాజెక్టుల పూర్తితోపాటు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగలా మార్చారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన సూర్యాపేట మండలంలోని మూసీ ప్రాజెక్టును సందర్శించి మాట్లాడా రు. తెలంగాణ ఏర్పడ్డాక మూసీ ప్రాజెక్టును కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి ఆయకట్టు రైతులకు రెండు పంటలకు సాగు నీరందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.