అమరావతి , జూలై :ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతున్నది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు …అయితే ప్రస్తుతం 847.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 75.4720 టీఎంసీలుగా ఉన్నది. ప్రాజెక్ట్లోకి భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,22,836 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 35,315 క్యూసెక్కులుగా ఉన్నది.