న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఢిల్లీలో గత రెండు మూడు రోజులుగా విస్తారంగా వానలు పడుతున్నాయి. ఇవాళ కురిసిన వర్షానికి ఢిల్లీలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరదనీరు నిలిచింది. కొన్ని చోట్ల గల్లీల్లో వరద నదులను తలపించింది. కొన్ని ఏరియాల్లో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలువడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రగతి మైదాన్ ఏరియాలో రోడ్లపై నిలిచిన వరద నీటికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..