హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఎల్బీ స్టేడియంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వార్సి బ్రదర్స్ నిర్వహించిన ఖవాలి అందరిని మైమరిపించింది. వారి గానానికి అందరూ మంత్ర ముగ్ధులయ్యారు. ఈ వేడుకలను సీఎం కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు.
వార్సి బద్రర్స్ ప్రఖ్యాతమైన ఖవాలి కళాకారులు. హైదరాబాద్ అందరమైన ఉర్దూకు, అద్భుతమైన కవాలికి ప్రసిద్ధి. మహమ్మద్ సిద్ధిక్ ఖాన్ మొఘల్ దర్బార్లో గాయకుడు. 1857లో బహదూర్ జఫర్ షా మరణించిన తర్వాత మహ్మద్ సిద్ధిక్ ఖాన్ ఢిల్లీని వదిలి హైదరాబాద్కు వచ్చాడు. ఈ హైదరాబాద్లో నిజాం ఆస్థాన కవిగా తన కవాలితో మైమరిపింపజేశాడు. ఆయన వారసులే ఈ వార్సీ బద్రర్స్. వీరు అమీర్ ఖుస్రూ ఖవాలీలకు చాలా ప్రసిద్ధి. 2014లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ఆ ఉర్దూ సుగంధాన్ని పంచబోతున్నారు. ఇరానీ చాయ్లో బన్ మస్కతి అద్దుకొని తిన్నట్లు కవాలిని ఆస్వాదిద్దామని ప్రముఖ కవి, గాయకుడు, రచయిత దేశపతి శ్రీనివాస్ సభకు తెలియజేశారు.