ఎల్కతుర్తి, మార్చి 19 : రాష్ట్ర బడ్జెట్లో మండల, జిల్లా పరిషత్లకు రూ.500 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఎల్కతుర్తి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, దయాకర్రావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ చిత్రపటాలకు వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కేడీసీసీ డైరెక్టర్ శ్రీపతి రవీందర్గౌడ్, రైల్వే బోర్డు మెంబర్ ఎల్తూరి స్వామి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కడారి రాజు, ఎంపీటీసీలు వేముల రజిని, బొంకూరి రజిత, చెవుల కొంరయ్య, బోడ అనూష, బోయినపల్లి భవాని, సర్పంచ్ కొమ్మిడి నిరంజన్రెడ్డి, నాయకులు గొల్లె మహేందర్, లోకిని సూరయ్య, బోయినపల్లి రాజేశ్వర్రావు, వెంకటేశ్ యాదవ్, అల్లకొండ రాజు, భాస్కర్రావు, సమ్మయ్య పాల్గొన్నారు.
రిస్క్ అలవెన్స్ ప్రకటించడం సంతోషకరం..
మట్టెవాడ : రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.800 కోట్ల రిస్క్ అలవెన్స్ ప్రకటించడంతో పాటు ఆటో డ్రైవర్లకు కూడా దాన్ని వర్తింపజేస్తానని అనడం సంతోషదాయకమని మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఇసంపెల్లి సంజీవ అన్నారు. ఈ మేరకు వరంగల్ కల్పలత సూపర్బజార్లో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్యే వినయ్భాస్కర్ చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంజీవ మాట్లాడుతూ కరోనా సమయంలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రూ.800 కోట్ల రిస్క్ అలవెన్స్ కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపర్ బజార్ చైర్మన్ వీ జనార్దన్, త్రిచక్ర పొదుపు సంఘం సలహాదారు రవీందర్ రెడ్డి, యూనియన్ నాయకులు కలకోట్ల జయరాం, చీకటి కుమార్, అంకుషావలి, గుండా రమేశ్, వెంకటేశ్వర్లు, శంకర్, యాకూబ్, జన్ను సదానందం, సాయిలు పాల్గొన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమ బడ్జెట్
భీమారం : కరోనా కష్ట కాలంలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి అధిక నిధులు కేటాయించడం అభినందనీయమని గ్రేటర్ 57వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఈ మేరకు హనుమాన్ నగర్ జంక్షన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. వ్యవసాయ రంగానికి అధిక నిధులను కేటాయించి, రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కాలనీ కమిటీ బాధ్యులు, దూలం రాంబాబు, మొట్ల మనోహర్, వలస సారంగం, సాదుల రఘుపతి, రాజ్కుమార్, కామారపు కిషన్, వెంకటేశ్, ఉదయ్ కిరణ్, రవీందర్ పాల్గొన్నారు.