కురవి, ఏప్రిల్ 1 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడ బిడ్డలకు వరమని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. కురవిలోని ఓం ఫంక్షన్ హాల్లో గురువారం కుర వి, డోర్నకల్ మండలాలకు చెందిన 89మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులకు దేశంలోనే ఎక్కడాలేని సంక్షే మ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో 65 వేల మంది రైతులకు రైతుబంధు కింద రూ.170 కోట్లు ఇస్తున్నామన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు నీళ్ల సమస్య తీరిందని, సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గానికి నీళ్లు తెచ్చానన్నారు.
యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగువుతున్నదని, 1.35 లక్షల టన్నుల ధాన్యం పండిందన్నారు. ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చే స్తుందన్నారు. ఖాళీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఎంపీపీలు గుగులోత్ పద్మావతి, ధరంసోత్ బాలునాయక్, జడ్పీటీసీ పోడిశెట్టి కమల, మానుకోట మార్కెట్ కమిటీ చైర్మన్ బజ్జూరి ఉమ, ఆత్మ చైర్మన్ తోట లాలయ్య, ఆలయ చైర్మన్ బదావత్ రాము నాయక్, వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్య, సొసైటీ చైర్మ న్లు దొడ్డ గోవర్ధన్ రెడ్డి, గార్లపాటి వెంకటరెడ్డి, తహసీల్దార్ విజయ్కుమా ర్, ఎంపీడీవో ధన్ సింగ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నున్న రమణ, ఎంపీటీసీ చిన్నం భాస్కర్, నాయకులు పిచ్చిరెడ్డి, రవి, విద్యాసాగర్, న ర్సింహారావు, వీరన్న, తుకారాం, రాజు నాయక్, రమేశ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
పండంటి బిడ్డ కోసం.. ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్
తులసి విత్తనాలు రోజూ తింటే..?