నర్సంపేట రూరల్, నవంబర్ 27 : పద్దెనిమిదేళ్ల నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ ఉమారాణి, ఆర్ఐ రజాక్, జూనియర్ అసిస్టెంట్ పెండ్లి రంజిత్కుమార్రెడ్డి వేర్వేరుగా కోరారు. ఆదివారం మండలంలోని లక్నెపల్లి, మహేశ్వరం, నర్సంపేట, ముత్తోజిపేట, ఇటుకాలపల్లి, కమ్మపల్లి, భాంజీపేట, చంద్రయ్యపల్లి, రాజుపేట, రాజపల్లి, గురిజాల, ముగ్దుంపురం గ్రామాల్లో ఓటర్ నమోదును బూత్ లెవల్ అధికారులు చేపట్టారు. బీఎల్వోలు పోలింగ్ స్టేషన్ల వద్ద ఉండి దరఖాస్తులు స్వీకరించారు. రెవెన్యూ అధికారులు పరిశీలించారు. బీఎల్వో, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
నల్లబెల్లి : మండలంలోని కన్నారావుపేటలో కొత్త ఓటర్ల నమోదును తహసీల్దార్ దూలం మంజుల ఆదివారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి పౌరుడి హక్కు అన్నారు. అలాగే ఓటరు లిస్టులో పేరు సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్ఐ రాజేంద్రప్రసాద్తోపాటు బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.
రాయపర్తి : మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని బంధనపల్లి, కొత్తూరు, పెర్కవేడు, కొండాపురం, ఊకల్, మైలారం,కొలన్పల్లి, రాయపర్తి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ ధరావత్ సూర్యానాయక్ పరిశీలించారు. తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామాల్లో మరణించిన, నివాసం ఉండని వారి పేర్లను పోలింగ్ బూత్ స్థాయి అధికారులు ఓటర్ల జాబితా నుంచి తొలగించాలన్నారు. అంగవైకల్యం గల ఓటర్ల వివరాలను జాబితాలో పేర్కొనాలని సూచించారు. గిర్ధావర్ కొయ్యాడ చంద్రమోహన్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శులు ఆజ్మీరా వెంకటేశ్నాయక్, రమేశ్, గద్దల కుమారస్వామి, కందికట్ల సురేశ్, మహేందర్, స్వప్న పాల్గొన్నారు.
గీసుగొండ : మండలంలోని గీసుగొండ, కోనాయిమాకులతోపాటు 15వ డివిజన్లోని గొర్రెకుంట, 16వ డివిజన్లోని ధర్మారం, జాన్పాక గ్రామాల్లో ఆదివారం ఓటరు నమోదు పక్రియను తహసీల్దార్ విశ్వనారాయణ పరిశీలించారు. ఓటరు నమోదులో తప్పులు లేకుండా బీఎల్వోలు చూడాలని సూచించారు. డిప్యూటీ తహసీల్దార్ రంజిత్కుమార్, ఆర్ఐ సాంబయ్య పాల్గొన్నారు.
ఖానాపురం: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని నర్సంపేట ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు. అశోక్నగర్ పోలింగ్ బూత్లో ఓటరు నమోదును ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటివరకు 283 బూత్ల ద్వారా 1600 దరఖాస్తులు వచ్చాయని, డిసెంబర్ 5వరకు దరఖాస్తులు స్వీకరించి 26న నూతన ఓటరు జాబితాను ప్రదర్శిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుభాషిణి, డీటీ సృజన్కుమార్, ఆర్ఐ సత్యనారాయణ, వీఆర్వోలు పాల్గొన్నారు.