హనుమకొండ, సెప్టెంబర్ 8 : నీట్ -2022 ఫలితాల్లో రెజోనెన్స్ సంస్థల విద్యార్థులు హవా చాటారని చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. హనుమకొండలోని రెజోనెన్స్ సెంటర్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ .. తమ బ్రాంచి విద్యార్థులు జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించి ప్రతిష్టాత్మకమైన వైద్య కళాశాలలో సీట్లు సాధించనున్నారని ఆనందం వ్యక్తం చేశారు. డీ శ్రీజ 660 మార్కులు, శార్వారి మౌక్తిక 595, షూక్ నుజహాత్ 586, శ్రీహిత శర్మ 577, అయన్ తేజ్ 586 మార్కులు సాధించారన్నారు.
వీరితో పాటు మరో 13 మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించారని వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం వరంగల్ బ్రాంచ్ నుంచి 41 మందికి పైగా మెడికల్ సీట్లు సాధిస్తున్నారన్నారు. జిల్లాలోనే అత్యధిక మార్కులు తమ విద్యార్థులే సాధిస్తున్నట్లు చెప్పారు. ఈ విజయానికి కారకులైన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రెజోనెన్స్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ లెక్కల మహేందర్రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్రెడ్డి, అకడమిక్ డీన్ బీఎస్ గోపాల్రావు పాల్గొన్నారు.