పర్వతగిరి, అక్టోబరు 4: మండలంలోని ఏనుగల్లు గ్రామం లో మంగళవారం రావణవధ కు ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టా రు. యువసేన యూత్ ఆద్వర్యంలో రావణ వధ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధ్యక్షులు గడ్డం లింగమూర్తి, ఉపాధ్యక్షులు కాగితాల సురేష్, కార్యదర్శి శీలం నాగరాజు చెప్పారు. దసరా పండుగ రోజు రావణవధ వైభవంగా జరుగుతుందన్నారు.
నేడు రంగశాయిపేటలో ..
కరీమాబాద్ : రంగశాయిపేటలోని మహంకాళి గుడి ఆవరణలో బుధవారం రావణవధ కార్యక్రమం చేపట్టేందుకు కమిటీ కృషి చేస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలు.. పటాకుల పేలుళ్లతో కన్నుల పండువలా సాగనుంది. దసరా ఉత్సవ సమితి అధ్యక్షుడు గుండు పూర్ణచందర్, ప్రధాన కార్యదర్శి దామెరకొం డ కరుణాకర్ ఆధ్వర్యంలో 36 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
నర్సంపేటలో..
నర్సంపేట: పట్టణంలో జరుగనున్న దసరా పండుగకు ఏర్పా ట్లు చేస్తున్నారు. అంగడి మైదానంలో దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. నర్సంపేట పట్టణంలో రావణవధ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పోలీసు స్టేషన్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సీఐ పులి రమేశ్ సమావేశం నిర్వహించారు.
సెకండ్ డాక్టర్స్ కాలనీలో ..
పోచమ్మమైదాన్ : వరంగల్లోని 12వ డివిజన్లోని సెకండ్ డాక్టర్స్ కాలనీలో రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వరద వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో సాయం త్రం జమ్మిచెట్టు పూజ అనంతరం రావణాసురుడి ప్రతిమను దహనం చేయనున్నారు. కమిటీ అధ్యక్షుడు బీ శరత్బాబు, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎస్ సురేశ్ కుమార్, సెక్రటరీ కే కిషన్రావు తెలిపారు. అలాగే గోపాలస్వామి గుడి, తోట మైదానంలో కూడా రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భద్రకాళి సద్దుల బతుకమ్మ, కమిటీ ప్రతినిధులు తెలిపారు.
కాశీబుగ్గలో..
కాశీబుగ్గ : నగరంలోని 20వ డివిజన్ కాశీబుగ్గ పద్మనగర్ చిన్నవడ్డేపల్లి చేరువు సమీపంలో మొదటిసారిగి దసర ఉత్సవాలను అంగరంగ వైభంగా నిర్వహిస్తామని ఉత్సవ సమితి ప్రతినిధులు తెలిపారు. దేశంలోనే మైసూర్ తరహాలో అన్ని రకాల బాణాసంచాలు కాల్చుతామని తెలిపారు. 30 సంవత్సరాలుగా కాశీబుగ్గ దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఓసిటీ మైదానంలో నిర్వహించినట్లు తెలిపారు.
నెక్కొండలో..
నెక్కొండ : మండల కేంద్రంలోని రామలింగేశ్వరస్వామి ఆల యంలో సాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మ వారు మహిషాసురమర్దిని అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు శాస్త్రి ఆధ్వర్యంలో పూజలు చేశారు. కార్యక్ర మంలో విగ్రహదాతలు దోర్నాల ధర్మారెడ్డి-వెంకటరమణ, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి-రుక్మిణి, మాలధారులు శ్రీరంగం పవన్కుమార్, గుండెబోయిన వెంకటేశ్, గుండం ప్రశాంత్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ సారయ్యకు ఆహ్వానం..
గిర్మాజీపేట : రంగశాయిపేటలో నిర్వహించే రావణవధ కార్యక్రమానికి రావాల్సిందిగా ఎమ్మెల్సీ సారయ్యను దసరా ఉత్సవ కమిటీ సభ్యులు కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. ఈమేరకు కమిటీ సభ్యులు మంగళవారం మండిబజార్లోని ఎమ్మెల్సీ సారయ్య ఇంటికి వెళ్ళి కలిసి శాలువా కప్పి సన్మానించారు. 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్ను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. కమిటీ అధ్యక్షుడు గుండు పూర్ణచందర్, ప్రధాన కార్యదర్శి దామెరకొండ కరుణాకర్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ముత్తినేని రామమూర్తి, కొక్కొండ భాస్కర్, పరికిపండ్ల రాజేశ్వర్, బీవీ రామకృష్ణప్రసాద్, పాకాల మనోహర్, బక్కి వంశీ, కన్నెబోయిన కుమార్, వరుణ్ పాల్గొన్నారు.