ములుగురూరల్, డిసెంబర్ 1 : ములుగు మండలంలోని రాయినిగూడెం గ్రామంలో బుధవారం తెల్లవారు జామున పెద్దపులి సంచరించింది. గ్రామ శివారు శ్మశాన వాటిక పరిసర ప్రాంతాలతో పాటు మిర్చి తో టలు, పంట పొలాల్లో తిరిగిన ఆనవాళ్లను గ్రామస్తులు ఉదయం గుర్తించారు. స్మశాన వాటికకు వెళ్లే దారితో పాటు మిర్చి తోటల్లో పులి పాదముద్రలు కనిపించా యి. ఈ విషయాన్ని ములుగు ఫారెస్టు రేంజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే పులి కొన్ని రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నర్సంపేటలోని పాకాల పరిసర ప్రాంతాల్లో తిరిగినట్లు అనుమానిస్తున్నారు. కాగా, ప్రస్తుతం రాయినిగూడేనికి వచ్చిన పులి కొత్తగూడ రేంజ్ నుంచి ముసలిమడుగు దాటి ములుగు రేంజ్లోకి ప్రవేశించినట్లు పాద ముద్రల ఆదారంగా తెలుస్తున్నది. దేవునిగుట్ట అటవీ మార్గంలో ఉన్న లింగప్పకుంట నుంచి శ్మశానవాటిక సమీపంలో తిరిగి అక్కడి నుంచి పంట పొలాల్లో సంచరించినట్లు పాదముద్రలను బట్టి అర్థమవుతోంది. పంట పొలాల మీదుగా లక్నవరం సరస్సు వద్దకు చేరుకున్న అనంత రం పులి నీటి ప్రవాహాన్ని చూసి దాటే ప్రయత్నం చేయకుండా దేవునిగుట్ట అడవిలోకి ప్రవేశించినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న ఎఫ్డీవో జోగేం దర్, ఎఫ్ఆర్వో రామ్మోహన్రావు, ఎఫ్ఎస్వో రమేశ్, ఎఫ్బీవోలు రాజేశ్, రమేశ్ పులి సంచరించిన ప్రదేశాల కు వెళ్లి పాదముద్రలను పరిశీలించి అవి పెద్దపులివేనని నిర్ధారించారు. గ్రామస్తులు, పశువుల కాపర్లు అడవిలోకి వెళ్లవద్దని, రాత్రివేళల్లో ఎవరూ బయటకు రాకుండా ఇండ్లలో ఉండాలని సూచించారు. కాగా, ఆగస్టు 31న దేవునిగుట్ట సమీపంలో సంచరించిన ఆడ పులి అక్టోబర్ 3న తాడ్వాయి అటవీ మార్గంలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో పడి మృతిచెందింది.