వరంగల్: భద్రకాళి శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం అమ్మవారు కపాలిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాత సేవలో పూజలు ప్రారంభించారు.
అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొన్నారు.