హైదరాబాద్: మన జీవిత కాలం పెరగాలంటే (దీర్ఘాయుష్షు) రోజుకు సగటున 7 వేల అడుగులు నడవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. లేదంటే వారంలో కనీసం రెండున్నర గంటలైనా శారీరక శ్రమ చేయాల్సిందేనని చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు టెన్నిస్, సైక్లింగ్, స్విమ్మింగ్, జాగింగ్ లేదా బ్యాడ్మింటన్ లాంటి క్రీడల పట్ల దృష్టి పెట్టాలని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
తాజాగా రెండు అధ్యయనాలు వెల్లడించిన ప్రకారం శారీరక శ్రమతోనే దీర్ఘాయువు చేకూరుతుందన్నది సారాంశం. ఈ అధ్యయనంలో భాగంగా 10 వేల మంది స్త్రీలు, పురుషుల అభిప్రాయాలను సేకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా వెల్లడైన అంశాలను వారు క్రోడీకరించారు. సరైన సమయంలో శరీరానికి తగినంతగా శ్రమ కలిగించే వ్యాయామాలను చేస్తే 70 శాతం వరకు అకాల మరణాన్ని నివారించవచ్చని తేలింది. కొన్ని సందర్భాల్లో తప్ప ఆసనాలతో జీవిత కాలంలో చురుకుగా ఉండే ప్రయోజనాలు కూడా చేకూరుతాయని సూచించాయి.
వ్యాయామాలు చేసేవారు జీవితగమనంలో చాలా చురుకుగా ఉంటారని పలు అధ్యయనాలు సూచించాయి. ఇదిలాఉండగా ఎవరైతే అరుదుగా వ్యాయామం, ఆసనాలు చేయగలుగుతారో వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. 2018లో వ్యాధి నియంత్రణ అండ్ నివారణ కేంద్రం ఓ అధ్యయనం చేపట్టింది. దీని ప్రకారం అమెరికన్ల మరణాలో్ల 10 శాతం ప్రజలు 40 నుంచి 70 ఏండ్ల వారు చాలా తక్కువ సమయం వ్యాయామం చేసినట్లు గుర్తించారు.
మరుసటి ఏడాది (2019)లో యూరోపియన్ అధ్యయన సంస్థ వివరాల ప్రకారం రెండు దశాబ్దాలుగా శారీరక శ్రమ లేకపోవడంతో నార్వేజియన్ యువత మృతి చెందినట్ల ప్రకటించింది. కానీ సైంటిస్టులు మాత్రం దీనిని శాస్త్రీయంగా ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ రెండు అధ్యయనాలు మాత్రం ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.