వనపర్తి రూరల్, అక్టోబర్ 26 : రాష్ట్రంలో రైతు లు వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమపై అధికంగా ఆధారపడుతున్నారు. పాడి పరిశ్రమ కొం డంత అండగా నిలుస్తున్నది. ప్రభుత్వం జీవాల పెంపునకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంతో పశుసంపద ఘణనీయంగా పెరిగింది. జీవాలపై ఆధారపడిన కుటుంబాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తున్నది. ఈ క్రమంలో ప్రభు త్వం ముందుచూపుతో పశువులు, గొర్రెలు, మేక లు గాలికుంటు వ్యాధి బారిన పడకుండా టీకాలు వేయిస్తున్నది. జీవాలకు నట్టలు, గాలికుంటు ని వారణ టీకాలు ఉచితంగా పంపిణీ చేస్తుండడంతో వనపర్తి జిల్లాలో దాదాపు 34,796 మంది జీవా ల పెంపకందారులకు మేలు చేకూరనున్నది. జిల్లా దాదాపుగా 1,47,620 పశువులు ఉన్నాయి. ఇందులో 72,531 నల్లజాతి, 75,089 తెల్లజాతి ఉన్నాయి. గొర్రెలు 9,76,832, మేకలు 80,608 ఉన్నాయి. 9,676 మంది పాడి పశువు ల పెంపకందారులు, 25,120 మంది గొర్రెలు, మేకల పెంపకందారులు ఉన్నారు.గాలికుంటు ని వారణ టీకా కార్యక్రమం కొనసాగుతున్నది. ఇప్ప టి వరకు జిల్లాకు 2 మిల్లీ లీటర్ల డోసులు 1,47,6 20 కాగా, 1,32,850 వచ్చాయి. అలాగే 100 మి.లీ. వాయిల్స్ 2,952 గానూ 2,657 వచ్చా యి. గొర్రెలు, మేకలకే కాకుండా నట్టల నివారణ మందులను పెద్ద పశువులకు కూడా వేస్తున్నారు. పది రోజుల నుంచి సుమారు నాలుగు నెలల వ యస్సున్న పశువులకు టీకా వేస్తున్నారు. చూడి ప శువులకు రెండు సార్లు మందులు వేశారు.
గాలికుంటు వ్యాధి..
గాలికుంటు వ్యాధి పాడి పశువులు, గొర్రెలు, మేకలకు వస్తుంది. ఇప్పటివరకు పాడి పశువులకు పశు సంవర్ధక శాఖ గాలికుంటు నివారణ టీకా ఉచితంగా అందజేస్తున్నది. గతంలో గొర్రెలు, మేకల యాజమానులు అవసరాన్ని బట్టి టీకాలను కొనుగోలు చేసి వేయించుకునేవారు. పశుపోషకులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే టీకాను ఉచితంగా అందిస్తున్నది.
లక్షణాలు.. చిక్సిత విధానం..
గాలికుంటు అంటువ్యాధి. ఈ వ్యాధి పికోర్నో వైరస్ స్ట్రెయిన్ వల్ల సోకుతుంది. పశువు మరణానికి కూడి దారితీస్తుంది. యుక్తవయస్సులో ఉన్న పశువుల్లో అధికంగా సోకి బలహీనపడుతుంది. దేశవాళీ పశువులలో కంటే సంకరజాతిలో ఎక్కువగా సోకుతుంది. నోటి ఎఫిలీథియం, పళ్ల చిగుర్లు, నాలుక, ముట్టె, లోపలి ప్రాంతాల్లో బొబ్బలు ఏర్పడుతాయి. దీంతో మేత తినలేవు. నోటి నుంచి చొంగకారుతుంది. కాళ్ల గిట్టల మధ్య బొబ్బలు రావడంతో నడవలేవు. పొదుగు వాపు వస్తుంది. వ్యాధి సోకిన పశువుల పాలు దూడలు తాగితే చనిపోయే అవకాశం ఉన్నది. ఈ పశువులను ఇతర వాటికి దూరంగా ఉంచి చిక్సిత అందించాలి. పొటాషియం, పర్మాంగనేట్ నీళ్లతో పుండ్లను శుభ్రం చేయాలి. నోటి పుండ్లకు బోరోగ్లిజరిన్, కాల పుండ్లకు జింక్ఆక్సైడ్, లోరాక్సిన్, హిమాక్స్ ఆయింట్మెంట్ వాడాలి. పశువుల మీద ఈగలు వాలకుండా వేపనూనె నింమ్లెంట్ మందులు వాడాలి. మేత మేయని పశువులకు సులభంగా జీర్ణమయ్యే పోషక పదార్థాలతో కూడిన ఆహారం అందించాలి.
నివారణ చర్యలు చేపట్టాలి..
గాలికుంటు వ్యాధి సో కితే వెంటనే నివారణ చ ర్యలు చేపట్టాలి. వ్యాధి నిరోధక టీకాలు 2 నెలల వయస్సులో మొదటి సారి.. ఒక నెల తరువా త బూస్టర్ డోస్ వేయించాలి. తరువాత ఏడాదికి ఒకసారి క్రమం తప్పకుండా వేయించాలి. టీకాలు వేసిన 1-3 వారాల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఏడాది వరకు వ్యాధి సోకకుండా ఉంటుంది. పశువైద్య సిబ్బంది ఆధ్వర్యం లో ప్రతి పశువుకు ఉచితంగా టీకాలను వే స్తున్నాం. ఈ అవకాశాన్ని గొర్రెలు, మేకల, పశువు ల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలి.