సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగా ణ ప్రధాన ప్రతినిధి) : సాధారణ ఎన్నికలకు భిన్నంగా, వినూత్నంగా సాగే పట్టభద్రుల ఎ మ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ పలు ఆసక్తికర అంశాలకు వేదికగా నిలుస్తున్నది. హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మె ల్సీ కౌంటింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం మొదలైన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా సాగిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ విజేత ఎవరనేది తేలలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగం గా ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. గతం లో ఎన్నడూ లేని విధంగా భారీగా ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నిక ఫలితాలను తేల్చేందుకు నాలుగు రోజులుగా సాగుతున్న కౌం టింగ్ ప్రక్రియకు శనివారం ముగింపు పడుతుందా? అనేది చర్చనీయాంశమైంది.
ముగ్గురు అభ్యర్థులకు కలిపి 80 శాతం ఓట్లు..
93 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కేవ లం ముగ్గురు అభ్యర్థులకు కలిపి 80 శాతం ఓట్లు రావడం విశేషం. మొదటి ప్రాధాన్యత ఓట్ల వివరాల్ని పరిశీలిస్తే..
సురభి వాణీదేవి (టీఆర్ఎస్ అభ్యర్థి) 1,12,689 ఓట్లతో 33.43 శాతం సాధించారు.
రాంచంద్రారావు (బీజేపీ) 1,04,668 ఓట్లతో 31.05 శాతం.
కె.నాగేశ్వర్ (స్వతంత్ర) 53,610 ఓట్లతో 15.90 శాతం.
జి.చిన్నారెడ్డి (కాంగ్రెస్) 31,554 ఓట్లతో 9.36 శాతం.
హర్షవర్ధన్రెడ్డి (స్వతంత్ర) 9,783 ఓట్లతో 2.90 శాతం.
టాప్-2 అభ్యర్థులు సాధించిన ఓట్ల శాతం : 64.49
టాప్-3 అభ్యర్థులు సాధించిన ఓట్ల శాతం : 80.39
టాప్-5 అభ్యర్థులు సాధించిన ఓట్ల శాతం : 92.66
టాప్-10 అభ్యర్థులు సాధించిన ఓట్ల శాతం : 97.31
మిగిలిన 83 మంది అభ్యర్థులు సా ధించిన ఓట్ల శాతం (2.69) కంటే చెల్లని ఓ ట్లు 21,309 (5.94 శాతం) ఎక్కువగా ఉం డటం విశేషం.
చెల్లని ఓట్ల కంటే తక్కువ ఓట్లు సా ధించిన అభ్యర్థులు 89 మంది ఉన్నారు. ఇం దులో టీడీపీ అభ్యర్థి ఎల్.రమణ కూడా (5,973 ఓట్లు) ఉన్నారు.
ఎలిమినేషన్ అనివార్యం..
కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వా త కోటా ఓట్లను 1,68,520గా నిర్ధారించా రు. అయితే ఏ అభ్యర్థి ముందుగా ఈ కోటా ఓట్లను సాధిస్తారో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ క్రమంలో 93 మందిలో అత్యధిక ఓట్లతో దూసుకుపోతున్న టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి మరో 55,831 ఓట్లను రెండో ప్రా ధాన్యతగా సాధిస్తే విజేతగా నిలవనున్నారు.