యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి వైభవోత్సవ కల్యాణం వేద మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కడు రమ్యంగా కొనసాగుతున్నది. అశేష భక్త జనంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
యాదాద్రి కొండకింద గల పాత హై స్కూల్ గ్రౌండ్ లో ప్రారంభమైన ఈ వేడుకలకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి దంపతులు, జెడ్పీ చైర్మన్, కలెక్టర్ అనితారామచంద్రన్ తదితరులు హాజరయ్యారు.