మామిళ్లగూడెం, ఆగస్టు 1: ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా ఎంతో కీలకమని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ‘ఫొటో ఓటర్ల జాబితాల సారాంశ సవరణ’పై కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటా ఎలక్టోరల్ జాబితా సవరణలు చేపడుతున్నామని, వచ్చే సాధారణ ఎన్నికల ముందు జరిగే చివరి జాబితా సవరణ ఇదేనని అన్నారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన మార్పులు ఆగస్టు-2022 నుంచి అమలులోకి వస్తాయన్నారు. దీనిపై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించామన్నారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉన్న వారి ఆధార్ నెంబర్ కోసం నూతనంగా ఫారమ్ 6బీని ఈసీఐ ప్రవేశపెట్టిందని అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటరు జాబితాలో ఇప్పటికే నమోదై ఉన్న ఓటర్లు.. తమ పేరు నమోదును ధ్రువీకరించుకునేందుకు ఆధార్ నెంబర్ను ఫారం-6బీ ద్వారా తెలియజేయాలన్నారు. ప్రతి పౌరుడికీ ఒకే ఒక ఓటు హకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. దానికి ఆధార్ నెంబర్ను అనుసంధానం చేసుకోవాలని సూచించారు.
ఈ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుందన్నారు. ఓటర్లు ఆధార్ నెంబర్ను అందించలేకపోతే ఫారం-6బీలో పేరొన్న ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదైనా ఒక పత్రాన్ని సమర్చించవచ్చని అన్నారు. వెబ్సైట్, యాప్లో నిబంధనలను అనుసరించి స్వీయ ప్రామాణీకరణతో యూఐడీఐఏతో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ ఓటీపీని ఉపయోగించి ఫారం-6బీ దరఖాస్తుతో ఆధార్ను ప్రామాణీకరించుకోవచ్చని తెలిపారు. బీఎల్వోలు ఓటర్ల నుంచి ఆధార్ నెంబర్ సేకరించడానికి ఇంటింటినీ సందర్శించడంతోపాటు ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారని అన్నారు. గతంలో ఓటర్ల నమోదుకు జనవరి 1 మాత్రమే ప్రామాణికంగా ఉండేదని, ఈ ఏడాది నుంచి జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను ప్రామాణికంగా తీసుకుంటామని అన్నారు. ఈ తేదీల్లోగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒకరికీ ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేస్తామన్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం-2023ను చేపట్టేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఓటరు జాబితాపై ఈ నెల 4 నుంచి అక్టోబర్ 24 వరకు ప్రీ రివిజన్ నిర్వహించి నవంబర్ 9న ముసాయదా జాబితాను విడుదల చేస్తామన్నారు. డిసెంబర్ 8 వరకు సదరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తామని, డిసెంబర్ 26లోగా అభ్యంతరాలను పరిషరించి, 2023 జనవరి 5న ఓటర్ల జాబితా తుది ప్రచురణను తయారు చేస్తామని అన్నారు. ఫొటో సిమిలారిటీ కింద నిరుడు 45,034 ఓట్లను గుర్తించామని, 21,543 నమోదులు డూప్లికేట్లుగా తేల్చి వాటిని తొలగించామని అన్నారు. నిరుడు 100కి పైగా కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటరు తన నివాస ప్రాంతానికి 2 కి.మీ పరిధిలోనే తన ఓటు హకు వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటరు జాబితా తయారీలో సహకరించాలని, పొరపాట్లు లేని జాబితా తయారు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో శిరీష, వివిధ పార్టీల నుంచి కమర్తపు మురళి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాంసృతిక కార్యక్రమాల కోసం బృందాలను సిద్ధం చేయాలని, నిర్వహణకు కమిటీ ఏర్పాటు చేసి ఆగస్టు 10 వరకు జాబితా సమర్పించాలని సూచించారు. అధికారులకు ఉత్తమ సేవా పురసారాల విషయంలో ఉత్తమ సేవలు, పారామీటర్లలో సాధించిన ప్రగతిని ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. శాఖల శకటాలు, స్టాళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వివిధ శాఖల పథకాలకు సంబంధించి యూనిట్ల గ్రౌండింగ్ పెద్ద ఎత్తున చేసేలా కార్యాచరణ చేయాలని, జాబితాను ఆగస్టు 10లోగా సమర్పించాలని సూచించారు. లకారంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అదనపు కలెక్టర్లు మొగిలి స్నేహలత, మధుసూదన్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.