హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ఓటర్గా నమోదు చేసుకోవడానికి 18 ఏండ్లు నిండిన వారికి ఏడాదిలో నాలుగుసార్లు అవకాశం కల్పించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ తెలిపారు. గురువారం బుద్ధభవన్లోని సీఈవో కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా, ఓటర్ కార్డులు-ఆధార్ అనుసంధానంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజీపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, టీడీపీ, బీఎస్పీ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వికాస్రాజ్ మాట్లాడుతూ.. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1న ఓటరుగా నమోదు చేసుకోవటానికి అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. ఆయా తేదీల నాటికి 18 ఏండ్లు నిండినవాళ్లు ఓటు కోసం నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఓటరు కార్డుల డూప్లికేషన్ లేకుం డా ఆధార్ అనుసంధానాన్ని తీసుకొచ్చామని వివరించారు. అలాగే నవంబర్లో విడుదల చేసే స్పెషల్ సమ్మర్ రివిజన్ (ఎస్ఎస్ఆర్) ఏవిధంగా చేపడుతున్నామన్న అంశంపై ఆయన సమావేశంలో వివరించారు.