సౌత్ ఆఫ్రికా : పని చేసే ప్రభుత్వానికే ఓటేయాలని సౌత్ ఆఫ్రికా శాఖ టీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అన్నారు.
హైదరాబాద్ను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తున్నదని ఆయన వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ప్రభుత్వం 1,33,001 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.
ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలతో నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. పట్టభద్రులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.