న్యూఢిల్లీ : 5జీ సేవలు దేశవ్యాప్తంగా త్వరలో అందుబాటులోకి రానుండగా ఈ నెలాఖరు నుంచి తమ 5జీ సేవలు ప్రారంభమవుతాయని రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ఇప్పటికే ప్రకటించాయి. ఇక వొడాఫోన్-ఐడియా (వీఐ) అతిత్వరలో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు సాగిస్తున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 5జీ సేవలు త్వరలో రానున్నాయని ఆ ప్రాంత యూజర్లకు కంపెనీ టెక్ట్స్ మెసేజ్లను పంపింది.
5జీ సేవల కోసం అవసరమైన పరికరాలు సమకూర్చుకునేందుకు వీఐ ఇటీవల నోకియా, ఎరిక్సన్ వంటి గ్లోబల్ లీడర్స్తో చేతులు కలిపింది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో 5జీ సేవల ప్రారంభం గురించి వీఐ యూజర్లకు మెసేజ్లు వచ్చాయి. గుడ్న్యూస్..వీఐ నెట్వర్క్ను 5జీకి అప్గ్రేడ్ చేస్తున్నాం..వీఐ నెట్వర్క్తో త్వరలో ఢిల్లీ-ఎన్సీఆర్లో మీకు బెటర్ కవరేజ్, సూపర్ఫాస్ట్ ఇంటర్నెట్ సర్వీస్ అందుబాటులోకి వస్తుందని ఈ మెసేజ్లో వీఐ పేర్కొంది
. అయితే 5జీ లాంఛ్కు సంబంధించి నిర్ధిష్ట కాలపరిమితి, డెడ్లైన్ వంటివి ఈ మెసేజ్లో వీఐ ప్రస్తావించలేదు. ఇక దేశవ్యాప్తంగా 5జీ సేవలు ఊహించిన దానికంటే ముందుగా లాంఛ్ అవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇక 4జీ కంటే పదిరెట్లు వేగంగా 5జీ స్పీడ్ ఉంటుందని కూడా ఆయన వెల్లడించారు.