విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 25 తర్వాత సమ్మెకు వెళ్లేందుకు కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు యజమాన్యానికి కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటికరించే నిర్ణయానికి వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నోటీసు అందజేసింది. ఆర్ఐఎన్ఎల్ను వంద శాతం ప్రైవేటీకరించే క్యాబినేట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు సీహెచ్. నర్సింగారావు, డి. ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ లేఖలో డిమాండ్ చేశారు. అదేవిధంగా 2019లో పోస్కోతో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందిగా పేర్కొన్నారు. పునరావాస కార్డుదారులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.