న్యూఢిల్లీ : భారత్లో వివో వీ25 ప్రొను వివో ఇండియా లాంఛ్ చేసింది. ఈ ఏడాది జనవరిలో లాంఛ్ అయిన వివో వీ 23 ప్రొ స్మార్ట్ఫోన్కు కొనసాగింపుగా లేటెస్ట్ 5జీ ఫోన్ లాంఛ్ అయింది. వివో వీ25 ప్రొ రూ. 35,999 ప్రారంభ ధరకు భారత్లో అందుబాటులో ఉంటుంది. ఫోటోగ్రాఫ్లపై మక్కువ ఉన్నవారితో పాటు మెరుగైన ఆల్రౌండర్ ఫోన్ కోసం అన్వేషించే వారికి లేటెస్ట్ వివో స్మార్ట్ఫోన్ మంచి అవకాశమని టెక్ నిపుణులు చెబుతున్నారు.
వివో25 ప్రొ సేల్ ఈనెల 25న ఫ్లిప్కార్ట్ ద్వారా షురూ అవుతుంది. సెయిలింగ్ బ్లూ, ప్యూర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ 3500 డిస్కౌంట్తో వివో వీ25 ప్రొను సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది. ఇది కాకుండా అదనంగా రూ 3000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.
ఇక న్యూ వివో వి సిరీస్ స్మార్ట్ఫోన్ కలర్ ఛేంజింగ్ బ్యాక్ ప్యానెల్తో పాటు ప్రీమియం ఎక్స్పీరియన్స్ అందించే 3డీ కర్వ్డ్ స్క్రీన్తో లభిస్తుంది. ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్తో 6.56 ఇంచ్ స్క్రీన్ను కలిగిఉంది. ఇక లేటెస్ట్ వివో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్సెట్తో 66డబ్ల్యూ పాస్ట్చార్జింగ్ సపోర్ట్తో 4830ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో మెరుగైన కెమెరా ఫీచర్లతో వివో వీ25 ప్రొ కస్టమర్లను ఆకట్టుకోనుంది.