న్యూఢిల్లీ : వివో భారత్ మార్కెట్లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంఛ్ చేసింది. భారతలో వివో టీ1 ప్రొ 5జీ, వివో టీ1లను ప్రవేశపెట్టింది. వివో టీ1 ప్రొ 5జీ అమోల్డ్ డిస్ప్లే, క్వాల్కాం స్నాప్డ్రాగన్ 778జీ, ఇన్డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సర్, 4700ఎంఏహెచ్ బ్యాటరీ, 66డబ్ల్యూ టర్బో చార్జింగ్ సపోర్ట్ వంటి పీచర్లతో కస్లమర్లను ఆకట్టుకుంటుంది.
ఇక వివో టీ1 5000ఎంఏహెచ్ బ్యాటరీ, అమోల్డ్ డిస్ప్లే, 44డబ్ల్యూ ఫాస్ట్చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో ముందుకొచ్చింది. అందుబాటు ధరలో కస్టమర్లకు మెరుగైన స్మార్ట్ఫోన్ అనుభూతి అందించడంపై దృష్టిసారించామని వివో ఇండియా డైరెక్టర్ పంకజ్ గాంధీ పేర్కొన్నారు.
తాజా లాంఛ్తో తమ టీ పోర్ట్పోలియో సిరీస్ను మరింత మెరుగ్గా విస్తరించామని చెప్పారు. ఇక వివో టీ1 ప్రొ 5జీ రూ 23,999 నుంచి రూ 24,999 మధ్య అందుబాటులో ఉండనుండగా, వివో టీ1 44 డబ్ల్యూ రూ 14,499 నుంచి రూ 17,999 మధ్య లభిస్తుందని కంపెనీ వెల్లడించింది.