హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక నిందితుడు సునీల్ యాదవ్ రిమాండ్ను కోర్టు పొడిగించింది. సెప్టెంబరు 1 వరకు రిమాండ్ పొడిగిస్తూ జమ్మలమడుగు కోర్టు మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. సునీల్కు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జమ్మలమడుగు కోర్టులో విచారణ జరిగింది. విచారణను కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖ వ్యక్తులను సీబీఐ అధికారులు విచారించారు. దాదాపు రెండున్నర నెలలుగా విచారణ కొనసాగుతున్నది. త్వరలోనే ఈ కేసులో పలువురిని సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.