దుబాయ్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సారథి విరాట్ కోహ్లీ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం దుబాయ్లో జరుగుతున్న ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఆర్సీబీ కెప్టెన్గా వైదొలుగుతానని ఒక ప్రకటనలో వెల్లడించాడు. అయితే ఐపీఎల్లో ఆడినన్ని రోజులూ బెంగళూరు తరఫునే ఆడతానని విరాట్ పేర్కొన్నాడు. ‘ఆర్సీబీ కెప్టెన్గా ఇదే నా చివరి ఐపీఎల్. ఇది ఒక గొప్ప, స్ఫూర్తివంతమైన ప్రయాణం. అద్భుతమైన జట్టుకు నాయకత్వం వహించినందుకు గర్వంగా ఉంది. ఇన్నాళ్లు నాకు మద్దతునిచ్చిన ఆర్సీబీ యాజమాన్యానికి, ఆటగాళ్లకు, సిబ్బందికి, అభిమానులకు ధన్యవాదాలు’ అని కోహ్లీ రాసుకొచ్చాడు. కోహ్లీ ఇప్పటికే టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్లో భారత జట్టు కెప్టెన్గా వైదొలుగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే.