పుణె: ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ను 3-1తో, టీ20 సిరీస్ను 3-2తో కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు వన్డే సిరీస్ కోసం పుణె చేరుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని క్రికెట్ జట్టు ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ్చింది. మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. పుణె శివార్లలోని ఎంసీఏ స్టేడియం వన్డేలకు ఆతిథ్యమిస్తుంది. మార్చి 26న రెండో వన్డే, 28న మూడో వన్డే జరుగుతాయి. 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టులో కర్ణాటక పేసర్ ప్రసిద్ కృష్ణ, ఆల్రౌండర్ కృనాల్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్లకు చోటు దక్కింది.