సౌతాఫ్రికాపై స్వదేశంలో తొలి టీ20 సిరీస్ గెలిచిన భారత జట్టు చరిత్ర సృష్టించింది. గువాహటి వేదికగా జరిగిన రెండో టీ20లో భారత బ్యాటర్లు చెలరేగడంతో భారత్ భారీ స్కోరు చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లోనే 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒక్క పరుగు చేస్తే హాఫ్ సెంచరీ పూర్తవుతుందనగా.. చివరి ఓవర్లో దినేష్ కార్తీక్ స్ట్రైకింగ్కు వచ్చాడు.
ఈ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన డీకే.. చివరి రెండు బంతులు మిగిలి ఉండగా కోహ్లీకి ఒక ఆఫర్ ఇచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడానికి సింగిల్ తీయమంటావా? అని అడిగాడు. అయితే అతనికి నో చెప్పిన కోహ్లీ భారీ షాట్లు ఆడాలని డీకేకు చెప్పాడు. దీంతో డీకే భారీ షాట్లకు ప్రయత్నించి ఒక సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ కోసం తాపత్రయపడకుండా డీకేను భారీ షాట్లు ఆడాలని కోహ్లీ చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
In addition to the run fest, a special moment as we sign off from Guwahati. ☺️#TeamIndia | #INDvSA | @imVkohli | @DineshKarthik pic.twitter.com/SwNGX57Qkc
— BCCI (@BCCI) October 2, 2022