చెన్నై: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ దాడిలో చనిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు అర్పించాడు ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి. ఆదివారం ట్విటర్ ద్వారా అతడు స్పందించాడు. ఎంతో ధైర్యవంతులైన మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారన్న వార్త పెద్ద విషాదం. వాళ్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని కోహ్లి ట్వీట్ చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారం దేశీ రాకెట్లు, మెషీన్ గన్లు, గ్రెనేడ్ లాంచర్లను ఉపయోగించి భద్రతా బలగాలపై నక్సల్స్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది జాడ తెలియడం లేదు. ఎంతో మంది గాయపడ్డారు. ఏకంగా 400 మంది నక్సల్స్ మూడు వైపుల నుంచి ఈ దాడికి తెగబడినట్లు అధికారులు వెల్లడించారు.
ఇవికూడా చదవండి..
ఐపీఎల్ ప్లేయర్స్కు వ్యాక్సిన్లు వేయమని అడుగుతాం: బీసీసీఐ
బాలీవుడ్ నటుడు గోవిందాకు కరోనా
పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు మరింత తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
మార్స్పై దిగిన నాసా మినీ హెలికాప్టర్
సారీ.. ఆ లోగో ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ వేసుకోలేను: మొయిన్ అలీ
వన్డేల్లో ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కొత్త వరల్డ్ రికార్డ్
మీరు క్రికెట్ ఎక్స్పర్టా? ఇది అవుటా.. కాదా చెప్పండి.. వీడియో
సినిమా టైటిల్ చెప్పని డైరెక్టర్.. ఎత్తి కుదేసిన నటుడు.. వీడియో
మమతా బెనర్జీ తప్పుడు ఆరోపణలపై ఎన్నికల సంఘం విచారణ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాషింగ్టన్ సుందర్ కుక్క పేరు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్కు కరోనా