టీం ఇండియా టెస్ట్ జట్టు సారధ్యానికి విరాట్ కోహ్లీ గుడ్బై చెప్పేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ గాయంతో జట్టుకు దూరం కావడంతో 2014 డిసెంబర్లో ఆస్ట్రేలియా టూర్లో ఆడిలైడ్ టెస్ట్ మ్యాచ్కు కోహ్లీ సారధ్యం వహించారు. అంతర్జాతీయ క్రికెట్లో టీం ఇండియాకు కోహ్లీ సారధ్యం వహించిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. నాటి మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 115 పరుగులు చేశాడు. టెస్ట్ జట్టుకు సారధిగా సెంచరీ దాటిన నాలుగో ఇండియన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. మ్యాచ్ చివరి రోజు సెకండ్ ఇన్నింగ్స్లో 57/2 పరుగుల వద్ద నిలిచిన జట్టును కోహ్లీ ఆదుకున్నాడు. విజయ్ మురళితో కలిసి మూడో వికెట్కు 185 పరుగులు జోడించాడు. విజయ్ ఔట్ అయిన తర్వాత టీం ఇండియా 315 పరుగులకే ఆలౌట్ అయింది. కోహ్లీ 175 బంతుల్లో 141 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
గాయం నుంచి కోలుకున్న ధోనీ బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్కల్లా అందుబాటులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ రెండు ఇన్నింగ్స్ల్లోనూ 19,1 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, తర్వాత మెల్బోర్న్లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో అజింక్య రహానేతో కలిసి తొలి ఇన్నింగ్స్లో 262 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు కోహ్లీ. ఆసియా ఖండం ఆవల టీం ఇండియా బ్యాట్స్మెన్ నెలకొల్పిన గరిష్ట స్కోర్ భాగస్వామ్యం ఇది. వ్యక్తిగతంగా కోహ్లీ 162 పరుగులు చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లోనూ ఐదో రోజు 54 పరుగులు చేయడంతో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మెల్బోర్న్ టెస్ట్ ముగియగానే ధోనీ.. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించేశాడు.
దీంతో సిడ్నీ టెస్ట్ మ్యాచ్ నుంచి పూర్తి సారధిగా నియమితులయ్యాడు కోహ్లీ. సిడ్నీ టెస్ట్ మ్యాచ్తో టెస్ట్ మ్యాచ్ల్లో రికార్డులు నమోదు చేశాడు. వరుసగా టెస్ట్ టీం సారధిగా మూడు టెస్ట్ మ్యాచ్ల తొలి ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన క్రికెటర్గా నిలిచాడు. సిడ్నీ టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో 46 పరుగులు చేసినా.. మ్యాచ్ డ్రాగా ముగియడానికి కారణం అయ్యాడు. ఆ ఏడాది ఆస్ట్రేలియా సిరీస్లో నాలుగు టెస్ట్ల్లో 692 పరుగులతో అత్యధిక స్కోర్ నమోదు చేసిన క్రికెటర్గా నిలిచాడు.
అయితే, 2015లో బంగ్లాదేశ్ టూర్లో కోహ్లీ ఫామ్ కోల్పోయాడు. టెస్ట్ మ్యాచ్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. అయితే టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తిరిగి శ్రీలంక టూర్లో తొలి టెస్ట్ మ్యాచ్లో కోహ్లీ 11వ సెంచరీ నమోదు చేసినా టీం ఇండియా ఓడిపోయింది. తదుపరి రెండు మ్యాచ్ల్లోనూ టీం ఇండియా గెలుపొందడంతోపాటు శ్రీలంకపై టెస్ట్ సిరీస్ను కోహ్లీ సేన 2-1 తేడాతో వశం చేసుకున్నది. కోహ్లీ సారధ్యంలో టీం ఇండియా గెలుచుకున్న టెస్ట్ సిరీస్ ఇదే.
2018లో స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్లో విరాట్ కోహ్లీ యావరేజ్ ప్రతిభ కనబరిచాడు. దీంతో సిరీస్ను 1-2 తేడాతో ఇండియాపై సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. 68 టెస్ట్ మ్యాచ్లకు సారధ్యం వహించిన కోహ్లీ 40 మ్యాచ్ల్లో విజయం సాధించాడు. కానీ ఆరు వన్డే మ్యాచ్ల సిరీస్లో మాత్రం 558 పరుగులు చేశాడు. మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. వాటిల్లో రెండు మ్యాచ్ల్లో నాటౌట్గా నిలిచాడు. అత్యధికంగా 160 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ను గెలుచుకున్న తొలి టీం ఇండియా సారధిగా కోహ్లీ రికార్డు నమోదు చేశాడు.