జైపూర్, జనవరి 21: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రధాని మోదీ ముఖం మీదే కుండబద్దలు కొట్టారు. దేశంలో హింసాయుత, ఉద్రిక్త వాతావరణం అలుముకుందని మోదీ పాలనపై ఆయన సమక్షంలోనే విమర్శలు ఎక్కుపెట్టారు. గత ఏడు దశాబ్దాల్లో దేశం ఏ మాత్రం ప్రగతి సాధించలేదని బీజేపీ చేస్తున్న ప్రచారం కూడా సరికాదని తిప్పికొట్టారు. గురువారం బ్రహ్మకుమారీలు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు వర్చువల్ మాధ్యమంలో పాల్గొన్న గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో శాంతి, సామరస్యం, సోదరభావం పెంపొందించాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు.