గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో సాధ్యమైంది. సీఎం కేసీఆర్ వాటిని నిజం చేసి చూపించారు. గ్రామాల ప్రగతే దేశాభివృద్ధికి నిదర్శమని అన్ని వసతులు కల్పించి బంగారు తెలంగాణకు బాటలు వేశారు. ఓ వైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమంతో జోడెద్దుల్లా ప్రగతి బండిని జెట్ స్పీడ్తో తీసుకెళ్తున్నారు. గ్రామాలు సుభిక్షంగా విలసిల్లేలా తనదైన ముద్ర వేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి రైతులు, కులవృత్తులకు తోడ్పాటు అందిస్తూనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న సర్పంచులకు గౌరవ వేతనం పెంచారు. పంచాయతీలకు ఇబ్బడి ముబ్బడిగా నిధులు విడుదల చేసి అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మించారు. పల్లెప్రగతి కార్యక్రమాలు చేపట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి పెట్టారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి రాజకీయ అవకాశాలతోపాటు తండాల అభివృద్ధికి దోహదం చేశారు. సీఎం కేసీఆర్తోనే పల్లెలు బాగుపడ్డాయని సర్పంచులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇదే అభివృద్ధి దేశమంతా జరుగాలని, ఇది ఒక్క కేసీఆర్తోనే సాధ్యమని స్పష్టం చేస్తున్నారు. ధరల పెరుగుదలకు కారణమైన బీజేపీ పీడ పోవాలంటే కేసీఆర్ సార్ దేశ రాజకీయాల్లోకి రావాలని, తామంతా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని పేర్కొంటున్నారు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది. ఏకంగా గౌరవ వేతనాలు ఇచ్చి గుర్తించింది. ఎనిమిదేండ్లలో రెండు సార్లు గౌరవ వేతనాలు పెంచింది. ఉమ్మడి రాష్ట్రంలో సర్పంచులకు కేవలం వెయ్యి మాత్రమే వేతనం ఇచ్చేవారు. ఇప్పుడు ఒక్కో సర్పంచ్కి నెలకు రూ. 6,500 ఇస్తున్నారు. అంటే సుమారు ఐదు రెట్లకు పైగా గౌరవ వేతనం పెరిగింది. అంతేకాకుండా నేరుగా సర్పంచుల అకౌంట్లలోకి డబ్బులు జమవుతున్నాయి. గతంలో గ్రామపంచాయతీ అకౌంట్లో జమయ్యాక సర్పంచులు తిరిగి బ్యాంక్ నుంచి డ్రా చేసుకునే పరిస్థితి ఉండేది. పెరిగిన గౌరవ వేతనంలో ఎంతో సంతోషంగా ఉన్నామని, ఇది కేసీఆర్తోనే సాధ్యమైందని సర్పంచులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పల్లెల్లో ప్రగతి పరుగులు..
గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో ప్రగతి పరుగులు పెడుతుంది. గతంలో గ్రామపంచాయతీలు కేంద్ర నిధులపైనే ఆధారపడేవి. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం సగం నిధులను జీపీలకు విడుదల చేస్తున్నది. ప్రభుత్వం సర్పంచులకు దండిగా నిధులు ఇవ్వడంతో గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయి. కరోనా సమయంలోనూ నిధుల విడదుల ఆగలేదు. ప్రభుత్వం నెలనెలా ఒక్కో గ్రామపంచాయతీకి జనాభాను బట్టి రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకు నిధులు ఇస్తున్నది. వీటిని సర్పంచులు గ్రామాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. గ్రామాల్లో రోడ్లన్నీ మెరుస్తున్నాయి. డ్రైనేజీలు నిర్మించారు. ట్రాక్టర్లను కొనుగోలు చేయించి చెత్త తరలింపునకు చర్యలు చేపట్టారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, రైతు వేదికలు నిర్మించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో ఎంతో లబ్ధి చేకూరింది. ఇంటింటికీ నీటి సౌకర్యం కల్పించారు. హరితహారం కార్యక్రమంతో పచ్చదనం పరిమళిస్తున్నది. పల్లెప్రగతిలో భాగంగా పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. గ్రామాల్లో స్వచ్ఛత, పరిశుభ్రత సంతరించుకుంది.
అందరికీ రాజకీయ అవకాశాలు..
తెలంగాణ ఏర్పడ్డాక అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని గిరిజనులు ఎన్ని ఉద్యమాలు చేసినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చాక తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారు. దీంతో ఎస్టీలకు రాజకీయంగా అవకాశాలు విస్తృతమయ్యాయి.
కేసీఆర్తోనే స్వర్ణ భారత్
తెలంగాణ కోసం కేసీఆర్ పడని కష్టం లేదు. ఏండ్ల తరబడి ఆంధ్రోళ్లకు ఎదురొడ్డి నిలబడిండు. అంతిమంగా కలలుగన్న రాష్ర్టాన్ని సాధించిండు. వచ్చిన రాష్ట్రం ఆగం కావద్దని ముందుండి నడిపించిండు. కేసీఆర్ వల్లనే ఊర్లన్నీ బాగుపడ్డయి. జనం కూడా సంతోషంగా ఉన్నరు. గతంలో నిధులు కూడా సరిగా వచ్చేవి కావు. ఇప్పుడు ఠంఛన్గా పైసలొస్తున్నయి. ఇది కేవలం కేసీఆర్ సార్తోనే సాధ్యం. హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాలు, రైతు వేదికలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ట్రాక్టర్ల కొనుగోలు ఇట్ల అనేక పనులు
చేపట్టారు. రోడ్లు, డ్రైనేజీలు కూడా మంచిగయ్యాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో పుష్కలంగా నీరు లభిస్తున్నది. ఇప్పుడు ఇదే మాడల్ను దేశ ప్రజలంతా కోరుకుంటున్నరు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందే. తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడారో దేశం కోసం కూడా పోరాడుతారు. సార్ ప్రధాని అవుతారు. అందరు కూడా ఇదే ఆకాంక్షిస్తున్నరు. కేసీఆర్తోనే స్వర్ణయుగం వస్తది. ప్రజావ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని ఇంకా ఎన్ని రోజులు భరించాలి..? ఆ పార్టీపై జనం మండి పడుతున్నారు.
– కర్రె వెంకటయ్య, సర్పంచ్, మల్లాపురం
(యాదగిరిగుట్ట రూరల్)
కేసీఆర్తోనే బీజేపీ ఆగడాలకు అడ్డుకట్ట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆగడాలకు అడ్డుకట్ట వేయడం కేసీఆర్తోనే సాధ్యం. మోదీ ప్రభుత్వ విధానాలు దేశాన్ని నాశనం చేసేలా ఉన్నాయి. ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై పెనుభారాన్ని మోపుతుంది. ప్రజల ఇబ్బందులు తెలిసిన నాయకుడు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే బాగుపడ్తాం. తెలంగాణలోని సంక్షేమ పథకాలు దేశంలో కూడా అమలైతే ప్రజలు సంతోషంగా ఉంటారు. కాబట్టి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే అది కేసీఆర్తోనే సాధ్యమైతది. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు తీరినట్లే దేశంలోని రైతుల సమస్యలు తీర్చగలరు. దేశ సమకాలీన సమస్యలపై కేసీఆర్కు అవగాహన ఉంది. ఆయన దేశ రాజకీయాల్లో రావాలని ఆయా రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ ప్రధాని అయితే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. అణగారిన వర్గాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్న కేంద్రానికి బుద్ధి చెప్పడం కేసీఆర్తోనే అవుతుంది.
– చిర్ర మల్లయ్యయాదవ్, వేములపల్లి సర్పంచ్(వేములపల్లి)
కేసీఆర్తోనే దేశంలో గ్రామ స్వరాజ్య స్థాపన
మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్య సాధన మన ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. ఆయన వెంటనే జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉన్నది. మన రాష్ట్రంలోని గ్రామాలు సాధించిన ప్రగతి మాదిరిగానే దేశవ్యాప్తంగా గ్రామాలు సాధించాల్సి ఉంది. అది కేసీఆర్తోనే సాధ్యపడనున్నది. 2014కు ముందు మన రాష్ట్రంలో గ్రామాల పరిస్థితి అధ్వానంగా ఉండేది. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు ఉండేవి కావు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పతో రాష్ట్రంలోని గ్రామాలను ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. నేడు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లి చూసినా అభివృద్ధి కనిపిస్తున్నది. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, కంపోస్టు షెడ్లు, వైకుంఠధామాల నిర్మాణంతోపాటు హరితహారంలో భాగంగా మొక్కలు నాడటంతో గ్రామాలన్నీ పచ్చదనం పరుచుకుని దేశానికే ఆదర్శంగా నిలిచాయి. అలా దేశమంతా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని కావాలని
కోరుకుంటున్నా. – వెంకటరమణారెడ్డి, రామడుగు సర్పంచ్(హాలియా)
కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగాలి
మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే స్వరాష్ర్టాన్ని ఎంతో నిబద్ధతతో సాధించిన నాయకుడు కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగాలి. నేడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశమంతా అమలు కావాలంటే కేసీఆర్ సేవలు దేశానికి ఎంతో అవసరం. పల్లె ప్రగతిలో భాగంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామాన్ని చూసినా పచ్చదనంతో కళకళాడుతుంది. గ్రామ స్వరాజ్యం సాధనతోపాటు దేశంలోని ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో నడువాలంటే కేసీఆర్ దేశనాయకుడు కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.
– లగ్గాని రమేశ్గౌడ్, పారుపల్లి సర్పంచ్(ఆత్మకూరు.ఎం)
కేసీఆర్తో దేశానికి సమర్థ నాయకత్వం..
కేసీఆర్ లాంటి సమర్థనాయకుడు దేశానికి అవసరం. ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సి ఉంది. ప్రతి రాష్ట్రానికి చెందిన రైతు నాయకులు, మేధావులు ఇక్కడికి వచ్చి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను చూసి అబ్బురపడుతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి దేశంలోని అన్ని పార్టీలు ఏకమవ్వాలి. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని ఇతర రాష్ర్టాల ప్రజలు సైతం కోరుకుంటున్నారు. గడచిన 8 ఏండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ వర్గానికి కూడా ఎలాంటి సాయం అందించలేదు. కేవలం సంపన్న వర్గాలకే మేలు జరిగింది.
– బక్క రాంప్రసాద్, రాఘవాపురం సర్పంచ్(ఆలేరు రూరల్)
కేసీఆర్తోనే దేశంలో సుస్థిరాభివృద్ధి
సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం, సాగునీరు, విద్యుత్ రంగాల్లో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో అన్ని రంగాల అభివృద్ధికి ప్రాధ్యాన్యం కల్పించారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుండడంతో గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజం దిశగా అడుగులు పడుతున్నాయి. సీఎం కేసీఆర్తోనే దేశంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది. విజన్ ఉన్న నాయకుడి సేవలు రాష్టానికే పరిమితం కావొద్దు. ఆయన సేవలు దేశానికి ఎంతగానో అవసరం. సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారోనని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై దేశ ప్రజలు విశ్వాసం కోల్పోయారు. ఈ సమయంలో కొత్త పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీకి సీఎం కేసీఆర్ వంటి బలమైన నాయకత్వం కూడా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజయాల్లో అనుభవజ్ఞుడైన నాయకుడి అవసరం. ఉంది. పట్టు వదలని విక్రమార్కుడిలా స్వరాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో తప్పక రాణిస్తారు. తెలంగాణ తరహాలో దేశాన్ని మోడల్గా తీర్చిదిద్దే సత్తా కేసీఆర్కే సాధ్యం.
– వస్పరి ధనలక్ష్మీవిష్ణు, దూదివెంకటాపురం సర్పంచ్(రాజాపేట)
సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం
గ్రామ స్వరాజ్య స్థాపనకు తెలంగాణ ఉద్యమ దివిటీ, ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేశారు. ప్రతి గ్రామానికి మౌలిక వసతుల కల్పనతోపాటు ప్రతి పల్లెకు స్వచ్ఛమైన తాగునీరందించేందుకు అహర్నిశలు కృషి చేశారు. ప్రతి పల్లె పచ్చగా ఉండాలనే సంకల్పంతో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. గతంలో గ్రామ పంచాయతీలు, సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా ఉండేది. స్వరాష్ట్రంలో పంచాయతీలకు ప్రత్యేక హోదా దక్కడంతోపాటు గ్రామ సర్పంచులకు గౌరవ వేతనాన్ని సైతం ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు పల్లెలు, తెలంగాణ వచ్చాక గ్రామాల పరిస్థితులు ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్నాయి. పాలనా సౌలభ్యం కోసం తండాలను సైతం గ్రామ పంచాయతీలుగా చేయడం గొప్ప విషయం. అభివృద్ధి కాంక్షించే ప్రభుత్వం కనుకనే ప్రతి గ్రామంలో పక్కా పంచాయతీ భవనాల నిర్మాణాలు, అభివృద్ధి పరుగులు కనిపిస్తున్నాయి. రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు.
– చిందం మల్లికార్జున్, అనంతారం సర్పంచ్
(భువనగిరి కలెక్టరేట్)
రాష్ర్టాన్ని అభివృద్ధి చేసినట్లే దేశాన్నీ చేస్తారు
రాష్ర్టాన్ని సాధించుకున్న స్ఫూర్తితో సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ప్రతి పల్లెనూ అభివృద్ధి చేస్తున్నారు. గ్రామపంచాయతీలకు నెలనెలా నిధులతో పల్లెలు సమగ్రాభివృద్ధి సాధిస్తున్నాయి. పారిశుధ్య కార్మికుల జీతాలను రూ.8,500లకు పెంచారు. దేశంలోనే తెలంగాణ పల్లెలు ఉత్తమ గ్రామపంచాయతీలుగా అవార్డులు పొందుతున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారు. దాంతో అధికారుల పర్యవేక్షణ పెరిగింది. 20 ఏండ్ల కింద మా అమ్మ పనకబండ గ్రామ సర్పంచ్గా పని చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో నిధుల కొరతతో అభివృద్ధి జరుగలేదు. సీఎం కేసీఆర్ దయతో మా ఊరు రాగిబావి కొత్త గ్రామపంచాయతీగా ఏర్పడింది. మా గ్రామం ఇప్పుడు మండలంలోనే ఉత్తమ పంచాయతీగా ఎంపిక కానున్నది. ఇదంతా సీఎం కేసీఆర్ సార్ చేపట్టిన పల్లె ప్రగతి, హరితహారంతో సాధ్యమైంది. కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసినట్లే దేశాన్ని సైతం అభివృద్ధి చేస్తారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావడం అత్యవసరం.
– రాంపాక నాగయ్య, రాగిబావి సర్పంచ్(మోత్కూరు)
కేసీఆర్ సార్ సేవలను దేశం కోరుకుంటుంది
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ సేవలను దేశమంతా కోరుకుంటున్నది. సబ్బండ వర్గాల ప్రజల కోరిక మేరకు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశమంతా వర్తింపజేసే అవకాశం ఉంటుంది. కేసీఆర్ తన ఎనిమిదేండ్ల పాలనలో అనేక అద్భుతాలు చేసి చూపించారు. గతంలో తెలంగాణలో సాగునీరు, విద్యుత్ కోసం అష్టకష్టాలు పడ్డ పరిస్థితి నుంచి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చి 24 గంటల కరెంట్ అందిస్తున్న ఘనత కేసీఆర్ సార్ది. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు మూడేండ్లలోనే పూర్తి చేసి రాష్ట్రంలోని అత్యధిక జిల్లాలకు సాగు, తాగునీరు అందిస్తున్న ఘనత కేసీఆర్ది. ఇప్పుడు అన్ని రాష్ర్టాలు తెలంగాణలోని ఎనిమిదేండ్లలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించుకుంటున్నాయి. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే తమ రాష్ర్టాల్లో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలవుతాయనే ఆలోచన చేస్తున్నారు.
– తూడి లావణ్య, ఇస్తాళాపురం సర్పంచ్
(ఆత్మకూర్.ఎస్)
దేశ రాజకీయాలకు దిశానిర్దేశనం చేయగల నేత కేసీఆర్
దేశ రాజకీయాలను దిశానిర్దేశనం చేయగల నేత సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. పక్క రాష్ర్టాలు సైతం తెలంగాణ సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతున్నాయి. ఇక్కడి తండాలు, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి దేశం చూస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం ద్వారా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. దేశవ్యాప్తంగా మౌలిక పరమైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా సరైన నిర్ణయాలు, సముచిత పాలన అందించడం ద్వారానే దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. రాజకీయంగా ఎంతో అనుభవం, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నేతగా సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలకు సరైన దిశానిర్దేశనం చేయగలరు.
– మల్లారెడ్డి, కోరుట్ల సర్పంచ్(చందంపేట)