ధారూరు, అక్టోబర్23: మండల పరిధిలోని అల్లాపూ ర్, నాగసముందర్ గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న మినీ బృహత్ పల్లె ప్రకృతివనం పనులను త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా డీఆర్డీవో పీడీ కృష్ణన్ అన్నారు. శనివారం ఆయన అల్లాపూర్లో మినీ బృహ త్ పల్లె ప్రకృతివనం పనులను త్వరగా పూర్తి చేసి మొ క్కలను నాటించాలని ఏపీవో సురేశ్, పంచాయతీ కార్యదర్శి దేవేందర్లను ఆదేశించారు. అదేవిధంగా ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలని, రోజుకు కనీ సం 200 వందల మందికి పని కల్పించాలన్నారు. నాగసముందర్ గ్రామ సమీపంలో రోడ్డుకు ఇరువైపు లా నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు. అనంత రం ఆయన నాగసముందర్ గ్రామ సమీపంలో పంట పొలంలో పత్తి తీసే కూలీలతో మాట్లాడారు. పత్తి తీస్తే డబ్బులు రెండు రోజుల్లో ఇస్తారని, ఉపాధి హామీ పనులు చేస్తే త్వరగా ఇవ్వడంలేదని డీఆర్డీవో పీడీకి మహిళలు తెలిపారు. దీంతో ఆయన ఉపాధి హామీ డబ్బులు పెండింగ్లో ఉండకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ధా రూరు ఎంపీడీవో ఉమాదేవి, ఈసీ రమేశ్, టీఏ శ్రీకాంత్, నాగసముందర్, అల్లాపూర్ గ్రామాల సర్పంచ్లు చంద్రకళ, జయమ్మ, నాయకులు అనిల్కుమార్, యాదగిరి, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
బృహత్ పల్లె ప్రకృతి వనంతో పచ్చదనం
కొడంగల్, అక్టోబర్23: తెలంగాణను హరిత రాష్ట్రంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ మండలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయిస్తున్నారని చిన్ననందిగామ సర్పంచ్ సావిత్రమ్మసాయిలు అన్నారు. చిన్ననందిగామలోని ప్రభుత్వ భూమి ఎనిమిది ఎకరా ల్లో రూ.36లక్షల ఎన్ఆర్జీఎస్ నిధులతో 24 వేల మొక్కలను పెంచేందుకుగాను శనివారం ఆమె ఉపాధి కూలీలతో గుంతలు తీసే కార్యక్రమాన్ని చేపట్టారు.