పరిగి, అక్టోబర్22: కులాంతర వివాహాలు చేసుకున్న వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. కు లాంతర వివాహాలు చేసుకున్న జంటలు ఇబ్బం ది పడకుండా ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని ఇస్తూ ఆదుకుంటున్నది. గతంలో నామమాత్రంగా ఉన్న ఈ ప్రోత్సాహకాన్ని సీఎం కేసీఆర్ రూ. 2.50లక్షలకు పెంచారు. తద్వారా ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయంతో ఆయా కుటుంబా లు ఆర్థికంగా ఎదిగేందుకు, చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని జీవించేందుకు ఎంతో దోహదపడుతున్నది. వికారాబాద్ జిల్లాలో 59మంది కులాంతర వివాహాలు చేసుకున్నారు. అందులో 17మందికి ప్రభుత్వం ప్రోత్సాహం కింద రూ. 42.50లక్షలను మంజూరు చేసింది. ఆయా జం టలకు ఈ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, సం బంధిత పత్రాలను అధికారులు అందజేస్తున్నారు.
2019 అక్టోబర్ 31 నుంచి..
కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఆదరణ కరువైన నేపథ్యంలో ప్రభుత్వం వారికి అండగా నిలుస్తున్నది. గతంలో కులాంతర వివాహం చేసుకున్న జంటకు రూ.50వేల ప్రోత్సాహాన్ని అప్పటి ఉమ్మడి ప్రభుత్వాలు ఇచ్చేవి. ఆ డబ్బు లు కూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ ప్రోత్సాహకాన్ని రూ.2.50లక్షలకు పెంచారు. ఎస్సీ అమ్మాయి లేదా అబ్బాయిని ఇతర కులాల వారు వివాహం చేసుకుంటే ఈ ప్రోత్సాహకం అందజేయడం జరుగుతుంది. కులాంతర వివాహం చేసుకున్న వారు తప్పనిసరిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇందుకు సంబంధించిన వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను దరఖాస్తుకు జతపరచాలి. ఆదాయ పరిమితితో సంబం ధం లేకుండా కులాంతర వివాహం చేసుకున్న జంటకు ఈ ప్రోత్సాహం అందుతుంది. ఒక్కొ క్క జంటకు రూ.2.50 లక్షలు ప్రోత్సాహకంగా అందజేస్తారు. ఈ డబ్బులు నేరుగా ఇవ్వకుండా దంపతుల పేరున బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్గా చేసి, ఆ పత్రాలను వారికి అందజేస్తారు. కనీసం మూడేండ్ల వరకు డిపాజిట్గా ఉంచాలి. తద్వారా వడ్డీతో కలిపి రూ.2.90లక్షలకు పైగా వారికి చెల్లిస్తారు.
ప్రోత్సాహకానికి 59 దరఖాస్తులు
వికారాబాద్ జిల్లా పరిధిలో కులాంతర వివాహా లు చేసుకున్న 59మంది జంటలు ప్రోత్సాహకం కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో ఇప్పటివరకు 49 దరఖాస్తులను అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు 17మందికి ప్రోత్సాహకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షల చొప్పున రూ.42.50 లక్షలు విడుదలవగా సంబంధిత జంటల పేరున సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి శుక్రవారం నుంచి వారికి ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతోపాటు జిల్లాకు ఈ ప్రోత్సాహకాల కోసం మరో రూ.11లక్షలు కూడా విడుదలైనట్లు తెలిసింది. వాటిని ఒకటి ,రెండు రోజుల్లో లబ్ధ్దిదారుల పేరిట బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టనున్నారు. మూడేండ్లపాటు ఈ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్గా కొనసాగించాల్సి ఉంటుంది. ఈ కాలంలో దంపతుల మధ్య బంధం మరింత బలపడుతుంది. సర్కారు ప్రోత్సాహంతో కు లాంతర వివాహాలు చేసుకున్న వారు తమ భవిష్యత్తుపై బెంగ పెట్టుకోకుండా స్వశక్తితో ఎదిగేందుకు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పరిగిలో 8 జంటలకు..
పరిగి, అక్టోబర్22: కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 8 జంటలకు ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల చొప్పు న బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పత్రాలను ఆయన అందజేశారు. కార్యక్రమంలో దోమ జడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎ.సురేందర్, జిల్లా ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి మల్లేశం, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఏఎస్డబ్ల్యూవో ఉమాపతి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు మలిపెద్ది ప్రభాకర్గుప్తా, బొంపల్లి సర్పంచ్ సురేశ్ పాల్గొన్నారు.
కొడంగల్లో రెండు జంటలకు..
కొడంగల్, అక్టోబర్22: పట్టణ పరిధిలో కులాంతర వివాహాలు చేసుకున్న రెండు జంటలకు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రభుత్వ ప్రోత్సాహాకాన్ని అందజేశారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన గోపాల్, వైష్ణవి అదేవిధంగా నాగేశ్,శిల్పరాణి జంటలకు ఒక్కొక్కరి రూ.2.50 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను అం దించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
అర్హులందరికీ అందిస్తాం
కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహకం అందజేస్తున్నది. అర్హులందరికీ ప్రోత్సాహకాన్ని అందజేస్తాం. ఎస్సీ అమ్మాయి లేదా ఎస్సీ అబ్బాయిని ఇతర కులాల వారు వివాహం చేసుకుంటే వారికి ప్రోత్సాహకం ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో జంటకు రూ.2.50 లక్షలు వారి పేరిట బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాటి పత్రాలు అందజేస్తాం. మూడేండ్ల తర్వాతే దంపతులు ఆ డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
-మల్లేశం, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి