బొంరాస్పేట/దౌల్తాబాద్/ అక్టోబర్ 22 : కుల వృత్తులకు స్వరాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన బొంరాస్పేట పెద్ద చెరువులో 1.10 లక్షల చేప పిల్లలను, దౌల్తాబాద్ మం డల కేంద్రంలోని పెద్ద చెరువు(మినిట్యాంక్బండ్)లో రెండు లక్షల చేప పిల్లలను వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే నరేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ కుల వృత్తుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేశారని, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అన్ని కులాల వారికి సమన్యాయం జరుగుతుందన్నారు. గొల్ల కురుమలకు గొర్రె పిల్లలు, మత్స్యకారులకు రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేసి జీవనోపాధి కల్సించామని, మత్స్య సంపదను పెంచడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. స్వరాష్ట్రంలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపా రని, నీలివిప్లవానికి శ్రీకారం చుట్టారన్నారు.మత్స్యకారులతో సంఘాలు ఏర్పాటు చేసి చెరువులపై వారికి పూర్తి హక్కులు కల్పించామని, చేపలను అమ్ముకోవడానికి రాయితీపై వాహనాలు అందజేస్తున్నామన్నారు. మత్స్య సహకార సంఘాలలో ఇతర కులాల వారిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల సంక్షేమానికి బడ్జెట్లో కూడా నిధులు కేటాయించామని చెప్పారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల మత్స్య సహకార సంఘాలకు ఎమ్మెల్యే నరేందర్రెడ్డి చేప పిల్లలను పంపిణీ చేశారు. జిల్లాలో ఈ ఏడాది చెరువులు, కుంటల్లో 1.18 కోట్ల చేప పిల్లలను వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 58 శాతం చేప పిల్లలను వదిలామని జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకులు దుర్గాప్రసాద్ అన్నారు. బొంరాస్పేట మండలంలో ఈ ఏడాది 9 లక్షల చేప పిల్లలను వదులుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చౌహాన్ అరుణాదేశు, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చాంద్పాషా, తాలుకా, మండల యూత్ అధ్యక్షులు నరేశ్గౌడ్, మహేందర్, మైనార్టీ అధ్యక్షుడు సలాం, ఎంపీటీసీలు శ్రవణ్గౌడ్, తిరుపతయ్య, సుదర్శన్రెడ్డి, నర్సింహులు, పార్టీ నాయకులు టీటీ రాములు, వాహబ్, ఖాజామైనుద్దీన్, రామకృష్ణ యాదవ్, లచ్చప్ప పాల్గొన్నారు.
వైకుంఠధామం, పల్లెప్రకతి వనం ప్రారంభం
దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో రూ.12.50లక్షల నిధుల తో నిర్మించిన వైకుంఠధామం, పల్లెప్రకృతివనాలను ప్రారంభించారు. గ్రామంలోని వివిధ వార్డుల్లో రూ.12 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.అనంతరం మండలానికి చెందిన కొంత మం ది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ దౌల్తా బాద్ మండల పార్టీ అధ్యక్షుడు ప్రమోద్రావు, దౌల్తాబాద్ సర్పంచ్ శీరిష , ఎంపీపీ విజయ్కుమార్, జడ్పీటీసీ కోట్ల మహిపాల్, వైస్ఎంపీపీ మహి పాల్రెడ్డి, మాజీ జడ్పీటీసీ మోహన్రెడ్డి, పర్సాపూర్ సర్పంచ్ సయ్యద్ అంజద్, మార్కెట్కమిటీ వైస్చైర్మన్ భీములు పాల్గొన్నారు.