పరిగి, సెప్టెంబర్ 14 : టీఆర్ఎస్ పార్టీకి ప్రజాబలం మెండుగా ఉందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగిలోని 8, 13 వార్డుల్లో నూతనంగా టీఆర్ఎస్ కమిటీల ఎన్నిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి వార్డు, గ్రామాల్లో టీఆర్ఎస్కు క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. మిగతా పార్టీలన్నింటి కంటే అత్యధికంగా టీఆర్ఎస్కు కార్యకర్తల బలం ఉందన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు శ్రమించి పనిచేయడం వల్లే అన్ని ఎన్నికల్లో విజయం సాధించామని, రాబోయే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే విజయమని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారందరికీ తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. స్థానిక సంస్థల్లో అవకాశాలు లభించని వారికి నామినేటెడ్, పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. మరింత అంకితభావంతో పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లేవారికి పార్టీ పదవులు దక్కుతాయని తెలిపారు. 3వ వార్డులో రూ.8లక్షలతో నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా 5వ వార్డు కమిటీ అధ్యక్షుడిగా జాక శ్రీశైలం, 8వ వార్డు అధ్యక్షుడిగా అశోక్, 13వ వార్డు అధ్యక్షుడిగా మేదరి శ్రీనివాస్ను ఎన్నుకున్నారు.
మర్పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గఫార్
మర్పల్లి, సెప్టెంబర్ 14 : మర్పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గఫార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి తెలిపారు. మర్పల్లి గ్రామ కమిటీ యూత్ అధ్యక్షులుగా బక్క శ్రీనివాస్, కె.శ్రీనివాస్నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కొహిర్ శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షుడిగా కె.జగదీశ్ (లడ్డు), మహిళా అధ్యక్షురాలిగా వై.సంతోష, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా కె.పాండు నాయక్, మైనార్టీ సెల్ అధ్యక్షులుగా సలీం, షరీఫ్, రైతు బంధు గ్రామ అధ్యక్షుడిగా పి.రాచన్న, గ్రామ సోషల్ మీడియా కన్వీనర్గా నవీన్కుమార్, రైతు విభాగం అధ్యక్షుడిగా వి.జైపాల్రెడ్డి ఎన్నికయ్యారు. గుర్రంగట్టుతండా గ్రామ అధ్యక్షుడిగా గోవర్ధన్, గ్రామ కమిటీ సభ్యులుగా సంతోశ్, రెడ్డినాయక్, సురేశ్, శ్రీనివాస్ను ఎన్నుకున్నారు.
గ్రామ కమిటీలే పార్టీకి సైనికులు
కోట్పల్లి, సెప్టెంబర్ 14 : టీఆర్ఎస్ పార్టీని అన్ని విధాలుగా బలపడేలా చేసేందుకు గ్రామస్థాయి కమిటీల సభ్యులు సైనికుల్లా పని చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు అనిల్కుమార్ అన్నారు. ఎన్నారం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎండీ యాకూబ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా రత్నమ్మ, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఇందూరి అశోక్, బీసీ సెల్ అధ్యక్షుడిగా దస్తన్న, యూత్ అధ్యక్షుడిగా పి.పాండు, రైతు విభాగం అధ్యక్షుడిగా హైమద్, మైనార్టీ అధ్యక్షుడిగా మొగులాన్ సాబ్, సోషల్ మీడియా అధ్యక్షుడిగా రమేశ్.. బీరోల్ రైతు బంధు అధ్యక్షుడిగా సంగారెడ్డి, గ్రామ సెల్ అధ్యక్షుడిగా బి.మాణయ్య, బీసీ అధ్యక్షుడిగా సీహెచ్ లక్ష్మణ్, యూత్ ప్రెసిడెంట్గా కె.రాజు, సోషల్ మీడియా అధ్యక్షుడిగా టి.వెంకట్, మహిళా అధ్యక్షురాలిగా తాండ్ర బాలమ్మ, మైనార్టీ అధ్యక్షుడిగా వాహిద్మియాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గ్రామ కమిటీ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
కోట్పల్లి, సెప్టెంబర్ 14 : కోట్పల్లి మండలంలోని 6 పంచాయతీల నూతన గ్రామ కమిటీ సభ్యులను మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అభినందిస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాండూరు సెగ్మెంట్కు సంబంధించిన కోట్పల్లి మండల అధ్యక్షుడు అనిల్కుమార్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కోట్పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు టి.శ్రీనివాస్గుప్తా, సభ్యులు అన్నాసాగర్ ఎల్లయ్య, ఓగులాపూర్ బాల్రెడ్డి, ఇందోల్ శ్రీనివాస్రెడ్డి, బుగ్గాపూర్ మహేందర్దొర ఎమ్మెల్యే కార్యాలయానికి మర్యాదపూర్వకంగా వెళ్లి ఎమ్మెల్యేను కలిశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి, పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
పార్టీ అభివృద్ధికి కృషిచేయాలి
పూడూరు, సెప్టెంబర్ 14 : ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ పుడుగుర్తి మల్లేశం పేర్కొన్నారు. పూడూరు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నీరటి నర్సింహులును ఎన్నుకున్నారు.