తాండూరు, సెప్టెంబర్ 14: తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలో టీఆర్ఎస్ మండల కమిటీల నియామకం ఏకగ్రీవంగా జరిగింది. తాండూరు పట్టణ అధ్యక్షుడిగా నయీం(అప్పు),తాండూరు మండల అధ్యక్షుడిగా రాందాస్, యాలాల మండల అధ్యక్షుడిగా మల్లారెడ్డి, బషీరాబాద్ మండల అధ్యక్షుడిగా రాములునాయక్, పెద్దేముల్ మండల అధ్యక్షుడిగా కోహీర్ శ్రీనివాస్ను ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, టీఆర్ఎస్ ఇన్చార్జి జహంగీర్పాషా కలిసి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనతో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్ర ముందుకు దూసుకెళ్తుందన్నారు. దీంతో దేశంలోని అన్ని రాష్ర్టాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్దే ఘన విజయమని వారు అన్నారు. అందుకు తగ్గట్లు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. పాత తాండూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం పార్లమెంట్లో మాట్లాడానని త్వరలో బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల తప్పకుండా వస్తుందని స్పష్టం చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయి లో అర్హతలు బట్టి పార్టీ పదవులకు ఎంపిక చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. తాండూరులో ఎలాంటి వర్గాలు లేవని అందరం కలిసి తాండూరు అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో పార్టీ కమిటీలను అందరి సమన్వయంతో ఏర్పాటు చేశామన్నారు. పార్టీ అధ్యక్ష, కార్యదర్శులపై పార్టీ అభివృద్ధి బాధ్యత ఉంటుందని అందుకు తగ్గట్లు అందరు పనిచేయాలని సూచించారు. టీఆర్ఎస్ ఇన్చార్జి జాంగీర్పాషా మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే పునాది అని అందుకు తగ్గట్టు కార్యకర్తలు నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రబ్బాని, తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్లు లక్ష్మారెడ్డి, విశ్వనాథ్గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.