గుండెపోటుతో విజయలక్ష్మి కన్నుమూత
సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్ తదితరులు
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ)/ చేర్యాల: శాసనమండలిలో చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి (63) మృతి చెందా రు. 15 రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆమెను.. కుటుంబీకులు జూబ్లిహిల్స్ అపోలోలో చేర్పించారు. గురువారం సాయంత్రం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆమెకు కొడుకు శిరీశ్రాజా, కూతురు వర్ష ఉన్నారు. విజయలక్ష్మి అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. విజయలక్ష్మి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపం తెలిపారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మున్సిపల్,ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తంచేశారు.
విజయలక్ష్మి పార్థివదేహానికి మంత్రుల నివాస సముదాయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, భానుప్రసాద్రావు, బాలసాని లక్ష్మీనారాయణ, భూపాల్రెడ్డి, గంగాధర్గౌడ్, ఎమ్మెల్యే రెడ్యానాయక్ తదితరులు నివాళుర్పించారు. మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు సంతాపం ప్రకటించారు.