అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘దివాళాకోరు బాబు చివరకు ఆనందయ్యను కూడా వదలడం లేదు. ఆయన మందును పరీక్షల కోసం పంపించింది ప్రభుత్వం. ఫలితాలు రాగానే పంపిణీ మొదలవుతుంది. శవాలపై పేలాలు ఏరుకునే బాబు డ్రగ్ మాఫియా కోసమే ఆనందయ్య మందును ఆపేశారని గుడ్డ కాల్చి మీదేశాడు. మాఫియాలన్నిటికీ బాసువి నువ్వే కదా బాబూ.’ అంటూ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు.
‘అధికారం అంటే తాను, తన గ్యాంగ్ దోచుకునేందుకు దొరికిన సువర్ణావకాశంగా భావిస్తాడు బాబు. 2015లో విద్యుత్ సంస్థలతో ఆయన చేసుకున్న రూ.39 వేల కోట్ల PPAలు మొత్తం కుంభకోణాల మయం. తక్కువ ధర కోట్ చేసిన కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని ఉంటే 19వేల కోట్ల ప్రజాధనం ఆదా అయ్యేది.’అని మరో ట్వీట్లో విజయసాయిరెడ్డి ఆరోపించారు.