హైదరాబాద్, మే18(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును తమిళ సినీ నటుడు విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ప్రగతిభవన్కు వచ్చిన విజయ్కు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ సాదరంగా ఆహ్వానించారు.
విజయ్కి సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించారు. సీఎం కేసీఆర్.. విజయ్ని ఆప్యాయంగా పలుకరించి సినిమా విశేషాలను అడిగి తెలుసుకొన్నారు. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. సీఎంను కలిసిన వారిలో ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు.